నా ఫ్యాన్స్ ఆరోగ్యమే ముఖ్యం అంటున్న స్టార్ హీరో

Update: 2020-04-08 14:30 GMT
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తున్న విషయం తెలిసందే. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ వలన వ్యాపారాలు - ప్రభుత్వ ప్రైవేట్ కార్యకలాపాలు - సినిమా షూటింగులు - స్కూల్స్ ఇలా అన్ని నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పటికే మన దేశంలోని సినీ ఇండస్ట్రీలు షూటింగులను నిలిపేసాయి. మన తెలుగు హీరోలు కూడా ఎక్కడివారు అక్కడే షూటింగ్స్ ఆపేసి ఇంట్లో కూర్చున్నారు. బాహుబలితో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న డార్లింగ్ ప్రభాస్ కూడా తన 20వ సినిమా షూటింగు ఆపేసి ఇంటికే పరిమితమయ్యాడు. ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ సినిమాను చకచకా పూర్తీచేస్తున్నాడు. అయితే ఇటీవలే జార్జియాలో షెడ్యూల్ పూర్తీ చేసుకొని చిత్రయూనిట్ హైదరాబాద్ చేరుకుంది.

ఈ లాక్ డౌన్ సమయాన్ని డార్లింగ్ ప్రభాస్ పూర్తిగా వినియోగించు కుంటున్నాడట. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు అని అడిగితే.. నా లాక్ డౌన్ సమయం అంతా నిద్ర పోవడానికి కేటాయిస్తున్నా అని చెప్పుకొచ్చాడట. అంతేగాక తన బెస్ట్ ఫ్రెండ్స్ తో వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడట. అనుష్క - రాజమౌళి - రానా ఇలా తనకు సన్నిహితమైన వారితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నాడట. మరి వాయిదా గురించి మాట్లాడితే.. సినిమాల కంటే ఇపుడు మనుషుల ప్రాణాలు ముఖ్యం అని సమాధానం ఇచ్చాడట. ఈ విషయం తెలిసిన డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ కి సినిమా కంటే ఆరోగ్యం ముఖ్యం అంటున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
  


Tags:    

Similar News