సాయితేజ్ ఆరోగ్యం గురించి థ‌మ‌న్ ఏమ‌న్నారంటే?

Update: 2021-09-30 08:33 GMT
మెగా మేన‌ల్లుడు సాయితేజ్ యాక్సిడెంట్ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డి కోలుకుంటోన్నట్లు కుటుంబ స‌భ్యులు తెలిపిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇంత‌లోనే సాయితేజ్ న‌టించిన `రిప‌బ్లిక్` ప్రీ రిలీజ్ వేడుక‌లో ప‌వ‌ర్ క‌ళ్యాణ్ ఇంకా బెడ్ మీద‌నే ఉన్నాడ‌ని.. కోమాలోనే ఉన్న‌ట్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో మ‌ళ్లీ అభిమానులంతా గంద‌రగోళానికి గుర‌య్యారు. దీంతో సాయితేజ్ ఆరోగ్యంపై ఏం జ‌రుగుతుందో తెలియ‌ని సందిగ్ద‌త ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత ప‌వ‌న్ పొలిటిక‌ల్ వ్యాఖ్య‌లతో స‌న్నివేశం మ‌రో ర‌కంగా మారింది. సాయితేజ్ ఆరోగ్యం సంగ‌తి ప‌క్క‌కు వెళ్లి...ప‌వ‌న్ వ‌ర్సెస్ ఏపీ ప్ర‌భుత్వం గా సీన్ మారిపోయింది.

అయితే తాజాగా సాయితేజ్ అభిమానుల‌కు సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ సంతోష‌క‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించారు. `నా ప్రెండ్ సాయితేజ్ కోలుకుంటున్నాడు. ఆరోగ్యం కుదుట‌ప‌డుతోంది. అప్ డేట్ ఇచ్చినంద‌కు స‌తీష్ బొట్టా అనే వ్యక్తి థ‌మ‌న్ కి ట్విట‌ర్ వేదిక‌గా కృత‌జ్ఞ‌త‌లు` తెలిపారు. ఇంకొన్ని రోజుల్లోనే నా స్నేహితుడు క‌లుస్తాన‌ని..అందుకు ఎంతో ఎగ్జైట్ గా ఎదురుచ‌స్తు న్నాన‌ని త‌మ‌న్ అన్నారు. అలా థ‌మ‌న్ సాయితేజ్ అభిమానుల‌కు రిలాక్స్డ్ డ్ అప్ డేట్ అందించారు. ఇక సాయితేజ్ న‌టించిన `రిప‌బ్లిక్` ఈ శుక్ర‌వారం రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి దేవక‌ట్టా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. గ‌తంలో దేవక‌ట్టా తెర‌కెక్కించిన ` ప్ర‌స్థానం` మంచి స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాతో ఆయ‌న‌కు ద‌ర్శ‌కుడిగా మంచి పేరొచ్చింది. అటుపై కొన్ని చిత్రాలు తెర‌కెక్కించిన పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. ఈ నేప‌థ్యంలో భార‌త రాజ్యాంగం..స‌మాజం ప‌ట్ల తీరును రిప‌బ్లిక్ టైటిల్ తో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేసారు. మ‌రి ఎలాంటి స‌క్సెస్ అందుకుంటుంద న్న‌ది చూడాలి.




Tags:    

Similar News