రౌడీ ఫెలో హీరోయిన్ దోపిడీకి గురైంది

Update: 2017-05-27 10:00 GMT
ప్రపంచంలోనే గొప్ప ఫిల్మ్ ఫెస్టివల్ కేన్స్ లో ప్రతి ఏటా జరుగుతుంది. ఈ ఏడు కూడా ఘనంగా జరిగింది. అక్కడకు ప్రపంచ నలుమూలలు నుండి నటులు, దర్శకులు వచ్చి వాళ్ళ సినిమాను ప్రమోట్ చేసుకోవడం వాళ్ళ సినిమాను అందరికీ చూపించడం ఎప్పుడు జరిగేదే.కాన్ని ఇక్కడ ఒక తెలుగు హీరోయిన్ కి కంగనా క్వీన్  సినిమా కష్టాలు వచ్చాయి.

ఇకపోతే విశాఖా సింగ్ అనే అమ్మాయి నారా రోహిత్ రౌడీ ఫెల్లో సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈమె అందరిలానే కేన్స్  ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్లింది, ఒక హోటల్ లో బస చేసింది. అంతవరుకు బాగానే ఉంది కానీ వైశాఖ తన పని మీద బయటకు వెళ్లినప్పుడు ఆమె ఉంటున్న రూమ్ లో దొంగలు పడ్డారు. విలువైన జ్యూయలరీ, నగదు, తన పాస్ పోర్ట్ ఎవరో దొంగలు దోచుకున్నారు. తిరిగి వచ్చిన విశాఖ చాలా కంగారుపడి వెంటనే అక్కడ ఉన్న సంబందిత అధికారులుకు చెప్పింది. వాళ్ళు దానిని అసలు పట్టించుకుపోవడం ఆమెకు మరింత చిరాకు పుట్టించింది. పాపం తన ఆక్రోశాన్ని ఎవరితో చెప్పాలో తెలియక ఇలా మనకు సోషల్ మీడియా ద్వారా చెప్పింది.

ఆ తరువాత మన ఇండియా ఎంబస్సీ అధికారులును సంప్రదించి తను తదుపరి చేయవలిసిన పనులు చేసింది. అది సంగతి. మొన్నామధ్యన గాయకురాలు మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి కూడా అమెరికాలో ఒక మ్యూజిక్ టూర్ లో ఉన్నప్పుడూ తన వస్తువులును ఎవరో దొంగలించారు. మొత్తానికి వెస్ర్టన్ కంట్రీస్ మన సెలబ్రిటీలతో తమ గొప్పతనాన్ని చాటిచెబుతున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News