శాతకర్ణి తర్వాత వెంకీతో ఫిక్స్

Update: 2017-01-11 04:01 GMT
ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్.. తన సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ ఉండేలా చూసుకుంటాడు. కథ-కథనం విషయంలో పక్కాగా ప్రిపేర్ అవడం కోసం.. టైం ఎక్కువగానే కేటాయిస్తాడు. కానీ మధ్యలో బాలీవుడ్ వెళ్లి అక్కడ కొన్ని యాడ్ ఫిలిమ్స్ ను తీసేసి వస్తుంటాడు. ప్రస్తుతం గౌతమిపుత్ర శాతకర్ణి కారణంగా.. క్రిష్ కి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది.

మరోవైపు విక్టరీ వెంకటేష్ తన నెక్ట్స్ మూవీ ఫైనల్ చేయడంలో బాగా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఇప్పటికే గురు చిత్రాన్ని కంప్లీట్ చేసిన వెంకీ.. మరోవైపు కొత్త కథల కోసం ఇంకా అన్వేషిస్తూనే ఉన్నాడు. కిషోర్ తిరుమలతో ఖాయమే అనుకున్న 'అడాళ్లూ మీకు జోహార్లు' అటకెక్కేసిందనే వార్తలు ఇప్పటికే ఉన్నాయి. మరోవైపు పూరీతో వెంకీ మంతనాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదట. జనగణమన చిత్రాన్ని మహేష్ కోసం అనుకుని.. ఇప్పుడు వెంకటేష్ కోసం కొన్ని మార్పులు చేసి తీసి యోచనలో ఉన్నాడని అంటున్నారు.

అయితే.. ఇవేవీ కన్ఫాం కాదని.. క్రిష్ తో మూవీ చేసేందుకు వెంకటేష్ దాదాపు  రెడీ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. పూరీతో మూవీ అంటే బడ్జెట్ భారీగా ఉంటుంది. కానీ.. క్రిష్ తో అయితే తక్కువ బడ్జెట్ తో మంచి ఔట్ పుట్ ఇస్తాడు. పైగా తనే నిర్మించడం ఈ దర్శకుడి ఆనవాయితీ. దర్శకుల ఫాం ప్రకారం చూసుకుంటే రిస్క్ కూడా తక్కువే ఉంటుంది. అందుకే క్రిష్ తో సినిమాకి వెంకీ ఫైనల్ అయ్యాడని.. శాతకర్ణి  రిలీజ్ తర్వాత రిజల్ట్ చూసి తుది నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News