బ్యాడ్‌ న్యూస్‌ ను హ్యాపీగా ప్రకటించిన వర్మ

Update: 2019-12-11 15:12 GMT
రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు అలియాస్‌ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రేపు విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. అయితే కొద్ది సేపటి క్రితం సినిమాకు సెన్సార్‌ పూర్తి కాలేదు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలో సినిమా విడుదల ఆగిపోయే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. కాని రామ్‌ గోపాల్‌ వర్మ అందరికి బ్యాడ్‌ న్యూస్‌ అంటూ సినిమా విడుదల విషయాన్ని చాలా సంతోషంగా ప్రకటించాడు.

ఎవరైతే సినిమాను ఆపేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారో.. ఎవరైతే సినిమా విడుదల కావద్దని కోరుకుంటున్నారో వారందరికి ఇదో పెద్ద బ్యాడ్‌ న్యూస్‌. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు సెన్సార్‌ కార్యక్రమం పూర్తి అయ్యింది. ఇదుగో సెన్సార్‌ సర్టిఫికెట్‌. కొందరు జోకర్స్‌ సినిమాను ఆపేందుకు చేసిన ప్రయత్నాలు ఏవీ కూడా సఫలం కాలేదు. రాజ్యాంగంలో ఉన్న భావ వ్యక్తీకరణ హక్కుతో నేను చేసిన ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు క్లియరెన్స్‌ వచ్చింది.

వర్మ ఈ సినిమాకు ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ ను కూడా ట్వీట్‌ చేశాడు. దాంతో రేపు ఉదయం సినిమా థియేటర్లలో పడటం కన్ఫర్మ్‌ అయ్యింది. రామ్‌ గోపాల్‌ వర్మ అనుకున్నట్లుగానే సినిమాను విడుదల చేసేందుకు సర్వశక్తులు ఒడ్డి మరీ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ రావడంతో ఈ సినిమాను ఎవరు ఆపలేరని.. ఖచ్చితంగా అమ్మ రాజ్యంలో కడప రెడ్లు రావడం కన్ఫర్మ్‌ అని తేలిపోయింది.
Tags:    

Similar News