టీజర్‌ చూపించే మంచి రేటుకు అమ్మేశారు

Update: 2019-02-17 11:41 GMT
కమెడియన్స్‌ హీరోలుగా మారడం టాలీవుడ్‌ లో చాలా కామన్‌, అయితే కమెడియన్‌ గా చాలా సినిమాలు చేసిన తర్వాత హీరోగా ప్రయత్నాలు చేస్తారు. కాని సప్తగిరి మాత్రం చాలా తక్కువ సమయంలోనే కమెడియన్‌ నుండి హీరోగా మారాడు. సప్తగిరి ఎక్స్‌ ప్రెస్‌ చిత్రంతో హీరోగా ఆకట్టుకున్న సప్తగిరి ఆ తర్వాత చిత్రంతో మాత్రం మెప్పించలేక పోయాడు. ఇప్పుడు కాస్త సీరియస్‌ టైటిల్‌ అయిన 'వజ్రకవచధర గోవింద' టైటిల్‌ తో కామెడీ చేసేందుకు సిద్దం అయ్యాడు. ఇటీవల విడుదలైన టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది.

దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌ థియేట్రికల్‌ రైట్స్‌ 3.60 కోట్లకు అమ్ముడు పోయినట్లుగా తెలుస్తోంది. సీడెడ్‌ ఏరియా డిస్ట్రిబ్యూటర్‌ బ్రహ్మయ్య ఈ చిత్రాన్ని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. సినిమా ఇంకా పూర్తి కాకుండానే టీజర్‌ చూసి నమ్మకంతో ఈ చిత్రాన్ని ఆయన కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దానికి తోడు సప్తగిరి ఎక్స్‌ ప్రెస్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన అరుణ్‌ పవార్‌ ఈ చిత్రానికి దర్శకుడు. అందుకే ఈ చిత్రంపై ఆసక్తి చూపించి ఇంత మొత్తం పెట్టి ఉంటాడు. షూటింగ్‌ త్వరలోనే ముగించి వేసవిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags:    

Similar News