బాసును డైరెక్ట్ చేయనున్న గురూజీ!

Update: 2018-11-17 06:10 GMT
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడమన్నది చాలామంది తెలుగు డైరెక్టర్లకు ఒక కల.  అందులో ఎంటువంటి అనుమానం పెట్టుకోవలసిన అవసరం లేదు. బాసు ఓ పదేళ్ళ పాటూ సినిమాలకు దూరంగా ఉండడంతో చాలామంది ఈ జెనరేషన్ స్టార్ దర్శకులకు ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం దొరకలేదు. ఆ లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు కూడా ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఈమధ్యనే మెగాస్టార్ త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మెగాస్టార్ ఇమేజ్ కి కరెక్టుగా సూటయ్యేలా.. అయన నుండి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఉండేలా ఒక కథ తయారు చేసి వినిపించడంతో త్రివిక్రమ్ కు బాసు 'గో ఎహెడ్' అని చెప్పారట. ఈ సినిమా చిరంజీవి-కొరటాల శివ సినిమా పూర్తయిన తర్వాత సెట్స్ మీదకు వెళ్తుందట.  డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం.

త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం కథ తయారు చేసే పనిలో ఉన్నాడట.  అల్లు అర్జున్ సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవి ప్రాజెక్ట్ పై ఫోకస్ చేస్తాడట.  చిరంజీవి-త్రివిక్రమ్ కాంబో అంటే డౌట్ లేకుండా ఒక క్రేజీ ప్రాజెక్టే.  గతంలో పవన్ - చిరంజీవి మల్టిస్టారర్ ను త్రివిక్రమ్ డైరెక్టర్ చేస్తాడని వార్తలు వచ్చాయి గానీ ఎందుకో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు.  అది మిస్ అయినా చిరంజీవి-త్రివిక్రమ్ కాంబో సెట్ కావడం ఫ్యాన్స్ కు ఆనందాన్నిచ్చేదే.
Tags:    

Similar News