ఇటలీ అన్న త్రివిక్రమ్.. సరే అన్న హారిక!

Update: 2018-09-22 10:01 GMT
ఎన్టీఆర్ తాజా చిత్రం 'అరవింద సమేత'ను దసరా సీజన్ లో రిలీజ్ చేయడానికి హారిక హాసిని వారు ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే టైట్ షెడ్యూల్స్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు రిలీజ్ కు మూడు వారాలకంటే తక్కువ సమయం ఉంది.  ఈ సమయంలో ప్యాచ్ వర్క్ - పోస్ట్ ప్రొడక్షన్ - ప్రమోషన్ కార్యక్రమాలు చూసుకోవాలి. కానీ త్రివిక్రమ్ మాత్రం ఇటలీ షెడ్యూల్ ఫిక్స్ చేశాడట.

 నిర్మాతలు ఈ సమయంలో ఫారిన్ షెడ్యూల్ పెట్టుకుంటే ఇబ్బందని అనుకున్నప్పటికీ త్రివిక్రమ్ మాత్రం నేను చూసుకుంటానని హామీ ఇవ్వడంతో హారిక హాసినీ వారు ఇటలీ లో డ్యూయెట్ చిత్రీక్రరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.   మిగతా పాటలన్నీ ఎమోషనల్ గా..  సీరియస్ గా ఉండడంతో సినిమాలో ఉండే ఓకే ఒక  డ్యూయెట్ ను బ్యూటీఫుల్ లోకేషన్స్ లో చిత్రీకరించేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట.

అంతా బాగానే ఉంది గానీ త్రివిక్రమ్ ప్యాచ్ వర్క్ - పోస్ట్ ప్రొడక్షన్ - ప్రమోషన్స్ సంగతి ఎలా చేస్తాడో.. అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకొస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయట. వేచి చూద్దాం... అంతా గురూజీ దయ.. ప్రేక్షకుల ప్రాప్తం.
    

Tags:    

Similar News