Bro.. ఆ సీన్ లో త్రివిక్రమ్ మాయ
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెపనక్కర్లేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు దాదాపుగా మంచి హిట్ను అందుకుంటాయి. ఆయన సినిమాలను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపుతుంటారు. ఆయన చిత్రంలో డైలాగ్స్ ఏ రేంజ్లో పేలుతాయో అందరికీ తెలిసిందే. మాటల మాంత్రికుడి పెన్కు అంత పవర్ ఉంటుందని అభిమానులు ఆశిస్తారు. ఇకపోతే మరో విషయమేమిటంటే.. ఆయన తెరకెక్కించే, పనిచేసే సినిమాల క్లైమాక్స్కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఎంతో అద్భుతంగా, భావోద్వేగాలతో చిత్రీకరిస్తుంటారు. సినిమాకు అదే స్పెషల్ అట్రాక్షన్ హైలైట్గా నిలుస్తుంటుంది.
అయితే ఇప్పుడాయన మహేశ్బాబుతో 'గుంటూరు' కారం సినిమాతో పాటు పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో' సినిమాకు పని చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రో చిత్రానికి మాటలను అందించారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
ఈ చిత్ర క్లైమాక్స్ను కూడా తనదైన మార్క్ స్టైల్లో బలమైన స్ట్రాంగ్ ఎమోషన్స్తో త్రివిక్రమ్ తీర్చిదిద్దారని తెలిసింది. పవన్ ఇమేజ్కు తగ్గట్టుగా అలాగే ప్రేక్షకుల మనసును తాకేలా స్క్రీన్ ప్లే.. సన్నివేశాలను, సంభాషణలను రూపొందించారని సమాచారం అందింది.
ఇకపోతే ఈ సినిమాను మాతృకలో దర్శకత్వం వహించిన సముద్రఖనినే డైరెక్షన్ చేశారు. త్రివిక్రమ్.. తనవంతుగా స్క్రీన్ప్లే రాసి మాటలు అందించారు. తెలుగు ఆడియెన్స్కు తగ్గట్టు కథలో మార్పులు చేశారట. అందులో భాగంగానే బలమైన భావోద్వేగాలతో కూడిన క్లైమాక్స్ను తీశారట. ఇది సినిమాకే హైలైట్గా నిలుస్తుందని ఇన్సైడ్ టాక్.
ఇంకా ఈ చిత్రంలో పవన్ కల్యాణ్తో పాటు మెగాహీరో సాయితేజ్ కీలక పాత్ర పోషించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ ఇతర పాత్రల్లో నటించారు. బ్రహ్మానందం, రోహిని మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కనిపించనున్నారు. తమన్ సంగీతం అందించారు.
జీ స్టూడియోస్తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం జులై 28న తెలుగు రాష్ట్రాలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. సోషల్మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. ఇక ఈ సినిమా రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయని సమాచారం అందింది.
అయితే ఇప్పుడాయన మహేశ్బాబుతో 'గుంటూరు' కారం సినిమాతో పాటు పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో' సినిమాకు పని చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రో చిత్రానికి మాటలను అందించారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
ఈ చిత్ర క్లైమాక్స్ను కూడా తనదైన మార్క్ స్టైల్లో బలమైన స్ట్రాంగ్ ఎమోషన్స్తో త్రివిక్రమ్ తీర్చిదిద్దారని తెలిసింది. పవన్ ఇమేజ్కు తగ్గట్టుగా అలాగే ప్రేక్షకుల మనసును తాకేలా స్క్రీన్ ప్లే.. సన్నివేశాలను, సంభాషణలను రూపొందించారని సమాచారం అందింది.
ఇకపోతే ఈ సినిమాను మాతృకలో దర్శకత్వం వహించిన సముద్రఖనినే డైరెక్షన్ చేశారు. త్రివిక్రమ్.. తనవంతుగా స్క్రీన్ప్లే రాసి మాటలు అందించారు. తెలుగు ఆడియెన్స్కు తగ్గట్టు కథలో మార్పులు చేశారట. అందులో భాగంగానే బలమైన భావోద్వేగాలతో కూడిన క్లైమాక్స్ను తీశారట. ఇది సినిమాకే హైలైట్గా నిలుస్తుందని ఇన్సైడ్ టాక్.
ఇంకా ఈ చిత్రంలో పవన్ కల్యాణ్తో పాటు మెగాహీరో సాయితేజ్ కీలక పాత్ర పోషించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ ఇతర పాత్రల్లో నటించారు. బ్రహ్మానందం, రోహిని మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కనిపించనున్నారు. తమన్ సంగీతం అందించారు.
జీ స్టూడియోస్తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం జులై 28న తెలుగు రాష్ట్రాలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. సోషల్మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. ఇక ఈ సినిమా రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయని సమాచారం అందింది.