సానుభూతి కోసం చెన్నై బ్యూటీ కష్టాలు

Update: 2017-01-20 12:26 GMT
తమిళనాడునే కాదు.. మొత్తం దేశాన్నే కుదిపేస్తున్న అంశం జల్లికట్టు. సుప్రీంకోర్టు నిషేధం అన్నాసరే.. ఈ క్రీడను వ్యతిరేకించిన వారిపై తమిళ జనాలు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు.. ప్రదర్శిస్తూనే ఉన్నారు. అందుకే ప్రతీ ఒక్క సెలబ్రిటీ తప్పనిసరిగా సపోర్ట్ చేసేస్తున్నారు. ఒక ట్వీట్ తో తమిళ జనాల నుంచి వ్యతిరేకత ఎదుర్కుని.. తర్వాత అకౌంట్ నే క్లోజ్ చేసేసింది చెన్నై బ్యూటీ త్రిష.

అకౌంట్ హ్యాకింగ్ కి గురైందంటూ త్రిష కంప్లెయింట్ ఇచ్చినా జనాలు నమ్మలేదు. తమిళ సాంప్రదాయాలను గౌరవిస్తామన్నా నిరసనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దీంతో తాను జల్లికట్టును సమర్థిస్తున్నానని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం త్రిషకు వచ్చింది. అందుకే ఇప్పుడు కోలీవుడ్ తారలు నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో పాల్గొంటోంది త్రిష. అజిత్.. సూర్య లాంటి స్టార్లతో కలిసి తను కూడా.. జల్లికట్టుకు ఆమోదించాల్సిందేనంటూ హంగర్ స్ట్రైక్ చేసేస్తోంది.

మాట పెదవి దాటితే సమస్యలు వస్తాయని ఇన్నాళ్లూ మనకు తెలుసు. ట్వీట్ జారితే చివరకు కడుపు కట్టుకుని మరీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం వస్తుందని త్రిష కష్టాలు చూస్తుంటే అర్ధమవుతుంది. ఇప్పటికైనా తమిళ జనాలు త్రిష వాదనను నమ్మితే.. అమ్మడికి భారం దిగినట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News