సగం ట్యాటూతో చూపులు పిండేసింది

Update: 2015-10-09 15:38 GMT
ఒంపుసొంపులూ వయ్యారాలూ ఉండటం వేరు.. వాటిని వడ్డించటం వేరు.. ఆ రకంగా శరీరాకృతి చూసుకుంటూ.. అసలు రిమ్మదెగులు తెప్పించే ఫిగర్‌ కాదు అమ్మడిది.. ఓ ఇలియానా నడుం.. ఓ రకుల్‌ వయ్యారాలూ.. ఓ కాజల్‌ అందాలు.. ఇలా ఏమీ లేవు.. కాని మన చెన్నయ్‌ సోయగం త్రిష మాత్రం వీటిల్లో ఎంత డల్‌ గా ఉన్నా కూడా 10 ఏళ్ల పాటు కెరియర్‌ లో ఓ పీక్‌ చూపించిందంటే.. ఖచ్చితంగా మనం మెచ్చుకోవాల్సిందే.

అందుకే అప్పట్లో త్రిష ఏం చెప్పిందంటే.. అందరూ ఏదైనా ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్‌ చూపించూ అంటున్నారు.. సో నేను ట్యాటూ ఒకటి వేయించుకుంటున్నా అంటూ సెలవిచ్చింది. అప్పటి నుండి ఆ నీమో ఫిష్‌ ట్యాటూ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఆ ట్యాటూకే చాలా అభిమాన సంఘాలు ఉన్నాయనడంలో అతిశయోక్తే లేదు. మొన్న చెన్నయ్‌ లో తూంగవనం ఆడియో లాంచ్ చేశారు. ఆ సందర్భంతో త్రిష ఓ సింగిల్‌ పీస్‌ గౌనులో విచ్చేసి.. సగం ట్యాటూతో ఫుల్లుగా ఎర వేసింది. ఏ రేంజులో కిక్కిచ్చిందంటే.. ప్రతీ మీడియా సంస్థ నుండి వచ్చిన కెమెరామ్యాన్‌ ఆమె టాటూ పైనే ఫోకస్‌ చేసి తమలోని సృజనాత్మకతను ప్రూవ్‌ చేసుకునే ప్రయత్నం చేశారంటే చూసుకోండి మరి.

అయితే ఇదే ప్రోగ్రాంలో కమల్‌ హాసన్‌ తనయ శృతి హాసన్‌ కూడా డాడ్‌ కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పడానికి విచ్చేసింది. ఇక ప్రక్కనే మన హీరోయిన్‌ మధు శాలినీ కూడా ఉంది. బట్‌.. అందరూ త్రిష ట్యాటూ ముందు తేలిపోయారంతే. కాదంటారా.. ఫోటోలు చూసి మీరే చెప్పండి.

Click here for photos : http://goo.gl/VhCu8q
Tags:    

Similar News