బాహుబలి కారణంగా ప్రభాస్ దేశమంతా పాపులర్ అయిపోయాడు. నో డౌట్ అందులో. అందుకే ఇప్పుడు సుజిత్ డైరక్షన్ లో చేసే సినిమాను మూడు బాషల్లో రూపొందించాలని అనుకుంటున్నారని మనం వింటున్నాం. ఇలా మనోడు ఇప్పటినుండే మూడు బాషల్లో సినిమా చేస్తే.. అది ఖచ్చితంగా రాంగ్ స్టెప్పే అవుతుంది. ఎందుకంటారా? పదండి సూద్దాం.
నిజానికి బాహుబలి సినిమా ఆడటం కారణంగా.. నేషన్ వైడ్ ప్రభాస్ - రానా - అనుష్క - రమ్యకృష్ణ - సత్యరాజ్ లకు పేరొచ్చిందే తప్పించి.. వీరందరి కారణంగా ఆ సినిమా ఆడలేదు. ఎందుకంటే బాహుబలి లో అతిపెద్ద హీరో ఆ విజువల్స్. ఆ తరువాతి హీరో రాజమౌళి. ఎవరేమనుకున్నా.. కమర్షియల్ పాయింటాఫ్ వ్యూ నుండి చూస్తే అది వాస్తవం. అందుకే ఒకేసారి ప్రభాస్ కనుక తన తదుపరి సినిమాను మూడు బాషల్లో చేస్తే.. అది చాలా వ్యయభరితం అయ్యే ఛాన్సుంది. అలా ఆవేశ పడకుండా.. ముందు తెలుగులో తన మార్కెట్ కు తగ్గట్లు సినిమాను ఫినిష్ చేసి.. దాని డబ్బింగ్ వర్షెన్ అక్కడ రిలీజ్ చేసుకుంటే బెస్ట్. మగధీర - శ్రీమంతుడు వంటి సినిమాల్లో తమిళంలోకి డబ్ అయినా.. రిజల్టు మనకు తెలిసిందే. సో.. బాహుబలిని చూసి ట్రై-లింగువల్స్ ప్రయత్నించడం అనేది చాలా బ్యాడ్ ఐడియా.
ప్రస్తుతం ప్రభాస్ మాత్రం బాహుబలి 2 షూటింగ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడట.