నారా రోహిత్ 'ప్ర‌తినిధి 2' ర‌ణ యుద్ధం

గతంలో ఒక మాస్ పాటను విడుదల చేయ‌గా వైర‌ల్ గా దూసుకెళ్లింది.

Update: 2024-05-04 18:08 GMT

నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'ప్రతినిధి 2' వచ్చే వారం థియేటర్లలో విడుదల కానుంది. మేకర్స్ ఆ మేర‌కు అధికారికంగా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ - రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట - సురేంద్రనాథ్ బొల్లినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు (టీవీ 5 మూర్తి) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సమ్మర్ హాలిడేస్ లో ఇది స్పెష‌ల్ ట్రీట్ గా మారుతుంద‌ని టీమ్ భావిస్తోంది.


'ప్రతినిధి 2' టీజర్ - ట్రైలర్‌కు అద్భుత స్పందన వచ్చింది. గతంలో ఒక మాస్ పాటను విడుదల చేయ‌గా వైర‌ల్ గా దూసుకెళ్లింది. జీవితం గురించి జ్ఞానాన్ని ప్ర‌సాదించేవాడిగా రోహిత్ ని ఈ పాట‌లో ఎలివేట్ చేసారు. రెండవ పాట- జర్నలిస్ట్ పై గీతం... ఆలోచింపజేసే పంక్తులతో కృష్ణకాంత్ రచించగా, స్వరాగ్ కీర్తన్ - జయంత్ పాడారు. ఈ పాటకు కూడా తక్షణం పాజిటివ్ స్పందన లభించింది.

'ప్రతినిధి' సిరీస్ లో ప్ర‌తినిధి 2 రెండో చిత్రం. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీప‌రుడైన‌ న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నాడు. సిరీ లెల్లా కథానాయికగా నటించ‌గా, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నాని చమిడిశెట్టి లెన్స్‌మెన్, యువ సంచలనం మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. దీనికి ఎడిట‌ర్: రవితేజ గిరిజాల, క‌ళ‌: కిరణ్ కుమార్ మన్నె.

Tags:    

Similar News