‘పెంగ్విన్‌’ విలన్‌ ఎవరో వారికి కూడా తెలియదట!!

Update: 2020-06-18 06:30 GMT
కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో కార్తీక్‌ సుబ్బరాజు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘పెంగ్విన్‌’ విడుదలకు సిద్దం అయ్యింది. థియేటర్లు ఇప్పట్లో విడుదల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కనుక ఓటీటీ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మరియు ట్రైలర్‌ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో విలన్‌ జోకర్‌ వేశం వేసుకుని ఉండి హత్యలు చేయడం నేరాలకు పాల్పడటం చేస్తూ ఉంటాడు.

అత్యంత రాక్షసంగా ప్రవర్తించే ఆ విలన్‌ ఎవరు ఆ జోకర్‌ మాస్క్‌ వెనుక ఉన్నది ఎవరు అనే విషయంను దర్శకుడు సస్పెన్స్‌ గా ఉంచాడు. విలన్‌ ఎవరు అనేది సినిమా చివర్లో తెలుస్తుంది. సినిమా విడుదలయ్యే వరకు ఆ విలన్‌ ఎవరు అనే విషయాన్ని చెప్పకూడదని దర్శకుడు భావించాడట. అయితే యూనిట్‌ సభ్యులకు విలన్‌ ఎవరో తెలిస్తే అందరికి తెలుస్తుందనే ఉద్దేశ్యంతో కనీసం యూనిట్‌ సభ్యులకు కూడా విలన్‌ ఎవరు అనే విషయాన్ని చెప్పకుండా మాస్క్‌ తోనే షూట్‌ చేశారట.

షూటింగ్‌ సమయంలో మాస్క్‌ తోనే ఆ విలన్‌ సెట్స్‌ రావడం మాస్క్‌ తోనే వెళ్లి పోవడం జరిగిందట. షూటింగ్‌ గ్యాప్‌ లో ఆయన ఎవరితో మాట్లాడకుండా ఉండేవాడట. దాంతో యూనిట్‌ సభ్యులకు కూడా ఆ మాస్క్‌ వెనుక ఉన్నది ఎవరు అనే విషయంలో క్లారిటీ లేదు. కొందరు యూనిట్‌ సభ్యులు గెస్‌ చేసేందుకు ప్రయత్నించినా విఫలం అయ్యారట. అసలు ఆ విలన్‌ లేడీనా జెంట్‌ అయ్యి ఉంటాడా అనే విషయం కూడా సస్పెన్స్‌ గా ఉంది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పెంగ్విన్‌ విలన్‌ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ప్రేక్షకులతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా సర్‌ ప్రైజ్‌ అవ్వబోతున్నారు అంటూ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు అంటున్నాడు.
Tags:    

Similar News