ఇంట్లోనే పట్టపగలే దారుణ హత్య కి గురైన సినీ నటుడు !

Update: 2020-10-22 06:15 GMT
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కర్ణాటక లో పట్టపగలు దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్నడు నటుడు సురేంద్ర బంట్వాల్ పట్టపగలే దారుణ హత్యకు గురయ్యాడు. పట్టపగలు ఇంట్లోనే హత్యకు గురవడంతో ఈ సంఘటన ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారింది. కర్నాటకలోని బంట్వాల్ తాలూకా బీసీ రోడ్డులో ఉంటున్నకన్నడ నటుడు సురేంద్రను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పట్టపగలు ఇంట్లో ఉన్న సమయం లోనే హత్య చేయడంతో ఈ ఘటన సంచలనం సృష్టిస్తుంది. బీసీ రోడ్డులోని తన అపార్ట్ మెంట్లో ఉన్న సమయంలో బుధవారం పట్టపగలు కొందరు గుర్తు తెలియని దుండగులు వచ్చి సురేంద్రను హతమార్చారు.

అయితే , సురేంద్ర బంట్వాల్ కి రౌడీ నేపథ్యం కూడా ఉంది. ఈయన పై  గతంలో కర్నాటక పోలీసులు రౌడీ షీటర్ కూడా తెరిచారు. సురేంద్ర కన్నడతో పాటు తుళు చిత్రాల్లో  కూడా నటించాడు. కొంతమంది వ్యక్తులతో సురేంద్రకు ఆర్ధిక లావాదేవీలున్నట్టు తెలుస్తోంది.  అలాగే, మరోవైపు బీజేపీ నేతల్ని బెదిరించిన కేసులో జైలుకు వెళ్లి, ఇటీవలే బెయిల్ పై బయటకి వచ్చారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.  

తుళు చిత్రం ఛలి పోలిలు లో సురేంద్ర పోషించిన కీలకపాత్రకు ప్రేక్షకుల్నించి విపరీతమైన స్పందన వచ్చింది. సమాజానికి ఓ సందేశంలా పనిచేసింది. ఈ సినిమా 2014లో విడుదలై సంచలనం కల్గించింది. తరువాత కన్నడ సినిమా సవర్ణ దీర్ఘ సంధి  లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సురేంద్రకు రాజకీయాల నేపధ్యం కూడా ఉంది. ఈ మద్యే  అతను కాంగ్రెస్ పార్టీలో చేరాడు. బీజేపీ కార్యకర్తల్ని కత్తితో బెదిరించిన వీడియో బయటకు రావడంతో సురేంద్ర వార్తల్లో కెక్కాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. అయితే , ప్రస్తుతం సురేంద్రను ఎవరు , ఎందుకు హత్య చేశారు అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
Tags:    

Similar News