సంక్రాంతి రేసులో క్రేజీ చిత్రాలు డౌటే!

Update: 2020-10-12 02:30 GMT
తెలుగు సినిమాకు ప్ర‌ధాన పండ‌గ సంక్రాంతి. ఈ రేసులో నిలిచి బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకోవాల‌ని హీరోలు.. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో పాటు హీరోలు పోటీప‌డుతుంటారు. గ‌త ఏడు నెల‌లుగా సినిమా షూటింగ్ లు ఆగిపోవ‌డంతో చాలా ‌సినిమాలు సంక్రాంతికి పోటీప‌డనున్నాయి. ఈ నెల 15 నుంచి థియేట‌ర్లు కూడా కేంద్ర రీ ఓపెన్ చేసుకోవ‌చ్చ‌ని మార్గ‌ద‌ర్శ‌కాల్ని విడుద‌ల చేయ‌డంతో క్రేజీ చిత్రాల మ‌ధ్య భారీ స్థాయిలో పోటీ ఏర్ప‌డ‌బోతోంది.

సంక్రాంతి రేసులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ న‌టిస్తున్న `వ‌కీల్ సాబ్‌`. య‌ష్ న‌టిస్తున్న కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 పోటీప‌డుతున్నాయి. ఈ భారీ చిత్రాల‌తో పాటు మిడిల్ స్టేజ్ మూవీస్ అఖిల్,.. పూజా హెగ్డే న‌టిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌`.., ర‌వితేజ న‌టిస్తున్నమాస్ మ‌సాల ఎంట‌ర్ ‌టైన‌ర్ `క్రాక్‌`.., గోపీచంద్ సీటీమార్...‌, నాగ‌చైత‌న్య `ల‌వ్ స్టోరీ` కూడా సంక్రాంతికి రేసుకి రెడీ అవుతున్నాయి.

వీటితో పాటు బాల‌య్య కూడా సై అంటున్నారు. బోయ‌పాటితో బాల‌కృష్ణ ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ రేసులో నిల‌వాల‌ని ప్ర‌భాస్ `రాధేశ్యామ్‌`..., చిరు `ఆచార్య‌`..., బ‌న్నీ `పుష్ప‌` చిత్రాలు ముందు ప్లాన్ చేసుకున్నాయి. అయితే క‌రోనా కార‌ణంగా ఆ ప్లాన్ మొత్తం రివ‌ర్స్ కావ‌డంతో సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకున్నాయి.
Tags:    

Similar News