సుశాంత్ కేసు: పీఎస్ కు వచ్చిన ఆ హీరోయిన్

Update: 2020-06-18 07:50 GMT
బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ ను షేక్ చేస్తూనే ఉంది. అతడిని ఇండస్ట్రీలో ఎవరెవరు  తొక్కేశారో వారి పేర్లను బయటపెడుతూ పలువురు సినీ సెలెబ్రెటీలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ బాలీవుడ్ మాఫియాపై  పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.

తాజాగా సుశాంత్ ది ఆత్మహత్యే అని తేల్చిన ముంబై పోలీసులు కారణాల పై ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికే సుశాంత్ సన్నిహితులు, బంధువులు, ఇంటిపనివాళ్లను పోలీసులు విచారించి వారి వాంగూల్మాన్ని తీసుకున్నారు.

తాజాగా సుశాంత్ ప్రేయసి, హీరోయిన్ రియా చక్రవర్తిని పోలీసులు గురువారం విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు ఉదయం బాంద్రాలోని పోలీస్ స్టేషన్ కు వచ్చిన రియాను విచారించిన పోలీసులు ఆమె నుంచి వాంగూల్మాన్ని తీసుకున్నట్టు తెలిసింది. దీంతో సుశాంత్ ఆత్మహత్య మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News