ఆ బయోపిక్ లో సన్నీ లియోనా??

Update: 2017-12-13 14:30 GMT
బాలీవుడ్ లో సినీతారలకు సంబందించిన బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి అంటే చాలు ఆ సినిమాపై అంచనాలు మాములుగా ఉండవు. వారు ఎంచుకునే కథలు కూడా అలా ఉంటాయి. ఆ మధ్య కాలంలో సిల్క్ స్మితా జీవిత ఆదారంగా వచ్చిన ది డర్టీ పిక్చర్ ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అలంటి కథనే మరొకటి బాలీవుడ్ వెండితెరపై చూపించాలని ప్రముఖ దర్శకుడు కరణ్‌ రాజ్దాన్ రెడీ అయ్యారు.

1950 లో బాలీవుడ్ లో అగ్రతారగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ట్రాజెడి క్వీన్ మీనా కుమారి బయోపిక్ కి ఇప్పుడు రంగం సిద్ధం అయ్యింది. అయితే ఈ బయోపిక్ లో మొదట విద్యా బలన్ ని అనుకున్నారు. అలాగే మాధురి దీక్షిత్ కి కూడా దర్శకుడు కథ వినిపించాడు. కానీ వారు వ్యక్తిగత కారణాల వల్ల నో చెప్పక తెప్పలేదు. కానీ ఎవరు ఊహించని విధంగా సన్నీ ఇప్పుడు ఆ సినిమాలో కనిపించడానికి రెడీ అయ్యింది.

దర్శకుడు కరణ్ చేత స్టోరీని చెప్పించుకొని మరి సన్నీ ఈ కథలో నటిస్తాను అని చెప్పిందట. ఈ విషయాన్ని దర్శకుడే చెప్పాడు. ఈ కథలో నటించడానికి సన్నీ చాలా ఇష్టపడుతోందని మీనా కుమారి పాత్రకీ భయపడకుండా దైర్యంగా న్యాయం చేకూరుస్తుంది అనే నమ్మకం తనకు ఉందని కరణ్ రాజ్దాన్ వివరించాడు. ఇక మీనా కుమారి చివరి రోజుల్లో భర్తకు దూరమై మద్యానికి బానిసయ్యింది. ఆ విషయాలను ప్రదానంగా చూపిస్తామని దర్శకుడు తెలిపాడు.  
Tags:    

Similar News