ప్రఖ్యాత ఫోర్స్బ్ బిజినెస్ మ్యాగజైన్ ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పనిలేదు. దిగ్గజ వ్యాపార వేత్తలు సహా హైఎండ్ ఆదాయ వర్గాల్లో టాప్ ఎర్నర్స్ వివరాల్ని అందించడం ఈ మ్యాగజైన్ ప్రత్యేకత. ప్రముఖుల సంపదలపై చర్చించడం.. ఆస్తుల వివరాలు అందించడం ఫోర్స్బ్ ప్రత్యేకత. ఫోర్స్బ్ కవర్ పేజీలపై వ్యాపార దిగ్గజాల ఫోటోలే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే అందుకు భిన్నంగా ఈసారి సౌత్ స్టార్ల ఫోటోలు దర్శనమిచ్చాయి.
ఫోర్బ్స్ అంటే.. సెలబ్రిటీల్ని చాలా అరుదుగానే ప్రచురిస్తుంటుంది. ఒకవేళ సెలబ్రిటీల్ని టచ్ చేయాలన్నా! హాలీవుడ్ కో..బాలీవుడ్ కో వెళుతుంది తప్ప.. అంతకు మించి రేంజ్ ఎంత మాత్రం తగ్గదు. అయితే ఈసారి ఫోర్స్బ్ సౌత్ హీరోయిన్ నయనతార ఫోటోని కవర్ పేజీపై ప్రచురించడం హాట్ టాపిక్ గా మారింది. నయన్ రేంజ్ ఏ స్థాయికి చేరిందో మరోసారి తేటతెల్లమైంది.
దక్షిణాదిన కోట్లాది రూపాయల మార్కెట్ ఉన్న హీరోలకే దక్కని అరుదైన అవకాశం నయనతారకు రావడం విశేషం. నయన్ ఇప్పుడు వరల్డ్ లోనే ఫేమస్ అవుతోంది. ఫోర్స్బ్ కవర్ పేజీ నాయికగా ఈసారి రెట్టింపు క్రేజుతో వెలిగిపోనుంది. నయనతారకి ఈ ఖ్యాతి ఎలా దక్కిందంటే ఆసక్తికర సంగతులే ఉన్నాయి. ఈసారి ఫోర్స్బ్ దక్షిణాది నుంచి నయనతారతోపాటు దుల్కార్ సల్మాన్..యశ్ లను ఎంపిక చేసుకుని..తుదిగా ఆ ఛాన్స్ నయన్ కి ఇచ్చింది. దక్షిణాదిన అన్ని భాషల్లో బిజీగా ఉన్న నటిగా నయన్ పేరు తేలింది. ఇతర భాషల్లో సినిమాలు చేయనప్పటకీ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.
కానీ నయన్ బిజీ షెడ్యూల్ కారణంగా వీలు పడలేదు. ఆ లెక్కన నయన్ ని అత్యంత క్రేజీ భామగా ఫోర్స్బ్ భావించింది. అలాగే లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేయడం.. స్టార్ హీరోలకు ధీటుగా పారితోషికం అందుకోవడం వంటివి నయన్ పేరును మరింత ముందుకు తీసుకెళ్లాయి. ఓటీటీలోనూ ఈ ముగ్గురుకి మంచి పేరుంది. అందుకే చివరిగా ముగ్గరి ఎంపికలో నయన్ కి ఈ అరుదైన అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నయనతార కోలీవుడ్ లో మాత్రమే ఎక్కువగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఫోర్బ్స్ అంటే.. సెలబ్రిటీల్ని చాలా అరుదుగానే ప్రచురిస్తుంటుంది. ఒకవేళ సెలబ్రిటీల్ని టచ్ చేయాలన్నా! హాలీవుడ్ కో..బాలీవుడ్ కో వెళుతుంది తప్ప.. అంతకు మించి రేంజ్ ఎంత మాత్రం తగ్గదు. అయితే ఈసారి ఫోర్స్బ్ సౌత్ హీరోయిన్ నయనతార ఫోటోని కవర్ పేజీపై ప్రచురించడం హాట్ టాపిక్ గా మారింది. నయన్ రేంజ్ ఏ స్థాయికి చేరిందో మరోసారి తేటతెల్లమైంది.
దక్షిణాదిన కోట్లాది రూపాయల మార్కెట్ ఉన్న హీరోలకే దక్కని అరుదైన అవకాశం నయనతారకు రావడం విశేషం. నయన్ ఇప్పుడు వరల్డ్ లోనే ఫేమస్ అవుతోంది. ఫోర్స్బ్ కవర్ పేజీ నాయికగా ఈసారి రెట్టింపు క్రేజుతో వెలిగిపోనుంది. నయనతారకి ఈ ఖ్యాతి ఎలా దక్కిందంటే ఆసక్తికర సంగతులే ఉన్నాయి. ఈసారి ఫోర్స్బ్ దక్షిణాది నుంచి నయనతారతోపాటు దుల్కార్ సల్మాన్..యశ్ లను ఎంపిక చేసుకుని..తుదిగా ఆ ఛాన్స్ నయన్ కి ఇచ్చింది. దక్షిణాదిన అన్ని భాషల్లో బిజీగా ఉన్న నటిగా నయన్ పేరు తేలింది. ఇతర భాషల్లో సినిమాలు చేయనప్పటకీ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.
కానీ నయన్ బిజీ షెడ్యూల్ కారణంగా వీలు పడలేదు. ఆ లెక్కన నయన్ ని అత్యంత క్రేజీ భామగా ఫోర్స్బ్ భావించింది. అలాగే లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేయడం.. స్టార్ హీరోలకు ధీటుగా పారితోషికం అందుకోవడం వంటివి నయన్ పేరును మరింత ముందుకు తీసుకెళ్లాయి. ఓటీటీలోనూ ఈ ముగ్గురుకి మంచి పేరుంది. అందుకే చివరిగా ముగ్గరి ఎంపికలో నయన్ కి ఈ అరుదైన అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నయనతార కోలీవుడ్ లో మాత్రమే ఎక్కువగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.