కరోనానే భయపెట్టేలా సంపూ సినిమా

Update: 2020-09-05 08:30 GMT
హృదయకాలేయం స్టార్‌ సంపూర్నేష్‌ బాబు గత ఏడాది కొబ్బరి మట్ట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ కొత్త సినిమాను ప్రకటించలేదు. ఆయన ఇతర సినిమాల్లో కమెడియన్‌ పాత్రలో కూడా నటించడం లేదు. కరోనా లాక్‌ డౌన్‌ కు ముందు నుండే సంపూర్నేష్‌ బాబు కొత్త ప్రాజెక్ట్‌ లు ఏమీ లేకుండా ఉన్నాడు. తాజాగా సంపూ కొత్త ప్రాజెక్ట్‌ కు రంగం సిద్దం అయ్యిందట. సంపూతో గతంలో సినిమాలు తీసిన సాయి రాజేష్‌ మరోసారి ఆయనతో సినిమాను నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఈసారి సంపూర్నేష్‌ బాబు కరోనాపై సినిమా చేయబోతున్నాడట. ఒక యంగ్‌ డైరెక్టర్‌ రెడీ చేసిన స్క్రిప్ట్ తో ఈ సినిమా రూపొందబోతుందట. కరోనాపై పేరడీగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. కరోనా సమయంలో జరిగిన కొన్న ఫన్నీ సంఘటనలు మరియు వైరస్‌ కు సంబంధించి కొన్న విషయాలను గురించి ఫన్నీగా చూపిస్తూ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే పలు స్ఫూప్స్‌ చేసి ఎంటర్‌ టైన్‌ చేసిన సంపూ మరోసారి ఈ సినిమాతో నవ్వించేందుకు రెడీ అవుతున్నాడు.
Tags:    

Similar News