ఆ హాలీవుడ్ సినిమాకు కాపీయా?

Update: 2018-01-18 07:33 GMT
ఎంటర్ టెయిన్ మెంట్ ప్రధానంగా ఉండే స్టోరీలు.. కమర్షియల్ ఎలిమెంట్లు నిండిన కథాంశాలనే నమ్ముకుని మొదట్లో వరస హిట్లు కొట్టుకుంటూ వచ్చాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. తిక్క సినిమా నుంచి తేజు లక్కు లెక్క్ తప్పింది. బాక్సాఫీస్ వద్ద వరసగా ఎదురుదెబ్బలు తగిలాయి. ఆఖరుకు కెరీర్ కు ఎంతో ప్లస్సవుతుందని నమ్మి కృష్ణవంశీ సినిమాలో స్పెషల్ రోల్ చేసినా ఆ ప్రయత్నమూ వృథానే అయింది. దీంతో తేజు పద్ధతి మార్చి ఈసారి ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్నాడు.

ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సాయి ధరమ్ తన తరవాత చిత్రం ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టు కరుణాకరన్ తో చేయనున్నాడు. ఇందులో ప్రేమమ్ భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించనుంది. హాలీవుడ్ పిక్చర్ ‘ది ఓ’ కథను స్ఫూర్తిగా తీసుకుని డైరెక్టర్ ఈ మూవీ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. హీరో హీరోయిన్లు కార్లో వెళుతుంటే ప్రమాదం జరిగి హీరోయిన్ గతం మర్చిపోతుంది. అప్పుడు హీరో ఆమెకు గతాన్ని గుర్తు తెచ్చి తిరిగి ఎలా తన ప్రేమలో పడేస్తాడు అనేదే కథాంశం. మర్చిపోయిన జ్ఞాపకాలను.. ప్రేమను తిరిగి తెప్పించడం అన్న కాన్సెప్ట్ తెలుగు తెరకు కొత్తేం కాదు. చిరంజీవి చేసిన ఆపద్బాంధవుడు కథా ఇంచుమించు ఇలాంటిదే.

కరుణాకరన్ ప్రేమకథలను గుండెకు హత్తుకునేలా తీస్తాడు. అప్పటి తొలి ప్రేమ నుంచి మొన్నటి డార్లింగ్ వరకు అతడు మామూలు ప్రేమకథలనే మెప్పించేలా తీశాడు. మరీ అజ్ఞాతవాసిలా కాపీ కొట్టకుండా కరుణాకరన్ తనదైన శైలిలో సినిమాను తీర్చిదిద్దితే ప్రేక్షకులను ఈజీగానే ఆకట్టుకుంటుంది. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమా షూటింగ్ పని పూర్తయిపోయింది. లావణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్. ఈ మూవీ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గా నటిస్తోంది.
Tags:    

Similar News