ఠఫ్ టాస్క్ మాస్టార్ ఎస్.ఎస్.రాజమౌళితో సినిమాకి లాక్ అవ్వడం అంటే ముందే ఆలోచించుకోవాలి. ఒకసారి కమిటైతే ఆయన మాట ఆయనే వినరు. భారీ పాన్ ఇండియా సినిమాలకు ఎలాంటి సమస్యా తలెత్తనివ్వకుండా ఆయన స్టార్ల నుంచి భారీగా కాల్షీట్లను లాక్ చేస్తారు. RRR కోసం సంతకాలు చేసిన అందరు స్టార్ల పరిస్థితి అదే.
రామ్ చరణ్ - తారక్ ఇప్పటికే ఏడాది పైగా లాక్ అయ్యి తదుపరి సినిమాల సెట్స్ కి వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇది పూర్తయ్యాకే అక్కడ జాయిన్ కావాల్సి ఉంటుంది. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా RRR కోసం పెద్ద మొత్తంలో కాల్షీట్లను కేటాయించింది. ఈ బూరె బుగ్గల చిన్నది ఇంతకుముందు హైదరాబాద్ షెడ్యూల్ లో పాల్గొంది. సెట్స్లో చేరి కీలక షెడ్యూల్స్ లో రెండు పాటలు మినహా తన అన్ని సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసింది. అటుపై బాలీవుడ్ లో నటించేందుకు వెళ్లిపోయింది.
అయితే ఆర్.ఆర్.ఆర్ లో ఇంకా మిగిలి ఉన్న భాగాల్ని ఎప్పటికి పూర్తి చేస్తుంది? అన్నది ఆరా తీస్తే.. అసలు విషయం లీకైంది. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ సాంతం పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నారు. తదుపరి రామ్ చరణ్- అలియా భట్ జంటపై రెండు పాటలు ఏప్రిల్ లో చిత్రీకరిస్తారు. అప్పటికి అనుకూలంగా ఆలియా కాల్షీట్లను సర్ధుబాటు చేసిందట. అది పూర్తయితే ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన చిత్రీకరణలు అన్నీ పూర్తయినట్టేనని తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఆలియా హైదరాబాద్ కి వచ్చి పాటల చిత్రీకరణలో పాల్గొంటారని తెలిసింది.
ఈ భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తుంటే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నారు. విదేశీ యువతి ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. పలువురు సౌత్ స్టార్లు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా ఈ పాన్ ఇండియా చిత్రం విడుదల కానుంది.
రామ్ చరణ్ - తారక్ ఇప్పటికే ఏడాది పైగా లాక్ అయ్యి తదుపరి సినిమాల సెట్స్ కి వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇది పూర్తయ్యాకే అక్కడ జాయిన్ కావాల్సి ఉంటుంది. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా RRR కోసం పెద్ద మొత్తంలో కాల్షీట్లను కేటాయించింది. ఈ బూరె బుగ్గల చిన్నది ఇంతకుముందు హైదరాబాద్ షెడ్యూల్ లో పాల్గొంది. సెట్స్లో చేరి కీలక షెడ్యూల్స్ లో రెండు పాటలు మినహా తన అన్ని సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసింది. అటుపై బాలీవుడ్ లో నటించేందుకు వెళ్లిపోయింది.
అయితే ఆర్.ఆర్.ఆర్ లో ఇంకా మిగిలి ఉన్న భాగాల్ని ఎప్పటికి పూర్తి చేస్తుంది? అన్నది ఆరా తీస్తే.. అసలు విషయం లీకైంది. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ సాంతం పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నారు. తదుపరి రామ్ చరణ్- అలియా భట్ జంటపై రెండు పాటలు ఏప్రిల్ లో చిత్రీకరిస్తారు. అప్పటికి అనుకూలంగా ఆలియా కాల్షీట్లను సర్ధుబాటు చేసిందట. అది పూర్తయితే ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన చిత్రీకరణలు అన్నీ పూర్తయినట్టేనని తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఆలియా హైదరాబాద్ కి వచ్చి పాటల చిత్రీకరణలో పాల్గొంటారని తెలిసింది.
ఈ భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తుంటే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నారు. విదేశీ యువతి ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. పలువురు సౌత్ స్టార్లు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా ఈ పాన్ ఇండియా చిత్రం విడుదల కానుంది.