పెళ్లిచూపులు హీరోయిన్ కు బంపరాఫర్

Update: 2017-02-08 09:51 GMT
‘పెళ్లి చూపులు’ సినిమా ద్వారా దానికి పని చేసి ప్రతి ఒక్కరి కెరీర్ మలుపు తిరిగింది. హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత ఎంత బిజీ అయ్యాడో తెలిసిందే. దర్శకుడు తరుణ్ భాస్కర్ కు కూడా మంచి ఆఫర్లు చేతికొచ్చాయి. సంగీత దర్శకుడు.. ఛాయాగ్రాహకుడు కూడా దర్శక నిర్మాతల కళ్లల్లో పడ్డారు. వాళ్లకూ మంచి అవకాశాలు అందుతున్నాయి. ఈ సినిమాలో ఇండివిడువల్ గా ఎదగాలని ఆశపడే అమ్మాయి పాత్రలో చక్కటి అభినయం ప్రదర్శించిన రీతూ వర్మకు కూడా మంచి అవకాశాలే అందుతున్నాయి. ఆమె ఆల్రెడీ అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘గూఢచారి’లో కథానాయికగా నటిస్తోంది. ఇంకా రెండు మూడు అవకాశాలు చేతిలో ఉన్నాయి.

వీటన్నింటికంటే మించిన బంపర్ ఆఫర్ ఇప్పుడు రీతూను వరించింది. తమిళ సూపర్ స్టార్ విక్రమ్ సరసన ఆమె నటించబోతోంది. అది కూడా గౌతమ్ మీనన్ లాంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో. విక్రమ్ హీరోగా.. గౌతమ్ ‘ధృవ నక్షత్రం’ అనే స్పై థ్రిల్లర్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ముందు అను ఇమ్మాన్యుయెల్ ను కథానాయికగా అనుకున్నారు. కానీ ఆమె డేట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో రీతూను అవకాశం వరించినట్లు సమాచారం. ‘పెళ్లిచూపులు’ సినిమాను తమిళంలో తన నిర్మాణంలో రీమేక్ చేస్తున్న గౌతమ్.. ఆ సినిమాలో రీతూ టాలెంట్ చూసి ఫిదా అయిపోయి ఆమెకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. విక్రమ్ లాంటి స్టార్ సరసన సినిమా అంటే రీతూ దశ తిరిగినట్లే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News