భార్య పోరు భరించలేకే నిర్మాతను చేశాడు

Update: 2015-08-04 15:41 GMT
పెళ్లయ్యాక కూడా అమలా పాల్ కు అవకాశాలకు కొదవేమీ లేదు. సినిమాలు కూడా బాగానే ఆడుతున్నాయి. వీఐపీ, మిలి సినిమాలు తన పెళయ్యాకే విడుదలయ్యాయి. సూపర్ హిట్టయ్యాయి. ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. భర్త అడ్డు చెప్పకపోవడంతో నటిగానే కొనసాగుతోంది అమల. కాకపోతే గ్లామర్ జోలికి మాత్రం వెళ్లట్లేదు. ఐతే కేవలం నటనతో సరిపెట్టకుండా ఇప్పుడు అమల నిర్మాణంలోకి కూడా అడుగుపెడుతుండటం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే. అది కూడా భర్త సినిమాతో కాకుండా ప్రియదర్శన్ దర్శకత్వంలో సినిమా తీయబోతోంది అమల.

ఇంతకీ ఇంత సడెన్ గా అమల నిర్మాతగా మారడానికి కారణమేంటి? ఇది ఎవరి ఆలోచన అని ఓ ఇంటర్వ్యూలో అమలను అడిగితే భలే తమాషా సమాధానమిచ్చింది అమల. ‘‘విజయ్ ను పెళ్లి చేసుకున్నాక సినిమాలు తగ్గించేశా. బోర్ కొట్టేస్తోంది. అతణ్ని రోజూ ప్రశ్నలతో వేధించడం మొదలుపెట్టా. ఏ రోజైనా లేటైతే ఎందుకు లేటైంది.. ఇంతసేపు ఏం చేస్తున్నావు అని పోరు పెడుతుంటే మా ఆయనకు విసుగొచ్చింది. అందుకే నీకిలా కాదని నన్ను నిర్మాతను చేశాడు. ఇక నేను సినిమా పనుల్లో బిజీ అయిపోతే తన మానాన తను పని చేసుకోవచ్చనేది ఆయన ప్లాన్. మళ్లీ ఆయన డైరెక్షన్లోనే సినిమా అంటే మళ్లీ నేను టార్చర్ పెడతానని వేరే డైరెక్టర్ తో సినిమా తీసే ఏర్పాటు చేశాడు’’ అంటూ చమత్కరించింది అమల.
Tags:    

Similar News