కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో తాను వీరప్పన్ ను తాను చెడ్డవాడిగా చూపించేస్తున్నానంటూ అతడి భార్య ముత్తు లక్ష్మి అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై రాంగోపాల్ వర్మ మండి పడ్డాడు. వీరప్పన్ మంచోడైతే మరి గాంధీని ఏమనాలి అని ప్రశ్నించాడు. వర్మ సినిమాను కౌంటర్ చేస్తూ వీరప్పన్ భార్య పంపిన నోటీసులో ఆమె కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
లంచగొండి ప్రభుత్వం - నయవంచక ఆటవిక అధికారుల నుంచి అడవులని రక్షించడానికి తన జీవితాన్ని ధారపోసిన వీరప్పన్ ని ఈ చిత్రంలో చెడ్డవాడిగా చూపబోతున్నారంటూ ముత్తు లక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేసింది. చాలా మంది తమిళులు వీరప్పన్ ని దైవ సమానుడిగా భావిస్తారని.. ఐతే వర్మ సినిమాలో వీరప్పన్ ని చూపించే విధానాన్ని బట్టి కర్ణాటక - తమిళనాడు రాష్ట్రాల ప్రజల మధ్యన పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయని ఆమె పేర్కొంది. సెన్సార్ బోర్డు వాళ్లు వర్మతో చేతులు కలిపి వర్మ తన భర్త ప్రతిష్టను దెబ్బ తీయడానికి ఈ సినిమా తీశాడని ఆమె ఆరోపించింది.
దీనిపై వర్మ స్పందిస్తూ.. "ప్రతి బిడ్డ తన తల్లికి ముద్దొచ్చినట్టుగానే ప్రతి భార్య తన భర్త మంచివాడనుకుంటుంది. ఒసామా బిన్ లాడెన్ భార్య కూడా తన భర్త కన్నా మంచివాడు ప్రపంచంలోనే లేడనుకుంటుంది..ఇప్పుడు నా ప్రశ్నేంటంటే.. ఒసామా బిన్ లాడెన్ - వీరప్పన్ కూడా మంచి వాళ్ళే అయితే మరి మహాత్మా గాంధీ గారి సంగతేంటి? అని ప్రశ్నించాడు.
లంచగొండి ప్రభుత్వం - నయవంచక ఆటవిక అధికారుల నుంచి అడవులని రక్షించడానికి తన జీవితాన్ని ధారపోసిన వీరప్పన్ ని ఈ చిత్రంలో చెడ్డవాడిగా చూపబోతున్నారంటూ ముత్తు లక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేసింది. చాలా మంది తమిళులు వీరప్పన్ ని దైవ సమానుడిగా భావిస్తారని.. ఐతే వర్మ సినిమాలో వీరప్పన్ ని చూపించే విధానాన్ని బట్టి కర్ణాటక - తమిళనాడు రాష్ట్రాల ప్రజల మధ్యన పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయని ఆమె పేర్కొంది. సెన్సార్ బోర్డు వాళ్లు వర్మతో చేతులు కలిపి వర్మ తన భర్త ప్రతిష్టను దెబ్బ తీయడానికి ఈ సినిమా తీశాడని ఆమె ఆరోపించింది.
దీనిపై వర్మ స్పందిస్తూ.. "ప్రతి బిడ్డ తన తల్లికి ముద్దొచ్చినట్టుగానే ప్రతి భార్య తన భర్త మంచివాడనుకుంటుంది. ఒసామా బిన్ లాడెన్ భార్య కూడా తన భర్త కన్నా మంచివాడు ప్రపంచంలోనే లేడనుకుంటుంది..ఇప్పుడు నా ప్రశ్నేంటంటే.. ఒసామా బిన్ లాడెన్ - వీరప్పన్ కూడా మంచి వాళ్ళే అయితే మరి మహాత్మా గాంధీ గారి సంగతేంటి? అని ప్రశ్నించాడు.