చరణ్‌ రచ్చ భలే మొదలైందబ్బా

Update: 2018-01-19 05:11 GMT
మెగా పవర్ స్టార్ ఈ మధ్యన కొత్త తరహా సినిమాలను చేస్తున్నాడనే అందరూ అనుకుంటున్నా.. మాస్ సినిమాలను మిస్సవుతున్నాడు అనే వాదన కూడా వినిపిస్తోంది. ధృవ సినిమా తరువాత సుకుమార్ డైరక్షన్లో రంగస్థలం సినిమా చేస్తున్న రామ్ చరణ్‌.. ఆ తరువాత ఎటువంటి సినిమా చేస్తాడు అనేది అందరికీ ఆసక్తిగానే ఉంది. మనోడు మాత్రం.. మాంచి మాస్ కమర్షియల్ ఎంటర్టయినర్ చేయాలని ఫిక్సయ్యాడు.

మాస్ సినిమాలను తీయడంలో పెట్టింది పేరైన దర్శకుడితో ఇప్పుడు తన కొత్త సినిమాను చేస్తున్నాడు చరణ్‌. విశేషం ఏంటంటే.. ఇంతవరకు రంగస్థలం సినిమా రిలీజ్ కాదు కదా.. ఫైనల్ కాపీ కూడా రాలేదు. అయినాసరే ఇప్పుడు మరో సినిమాకు శ్రీకారం చుట్టేశాడు. ఈరోజు ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న వనదేవత టెంపుల్ దగ్గర ఈ సినిమాకు ముహూర్తం కొట్టారు. ఈ సినిమాలో మహేష్‌ బాబుతో భరత్ అను నేను సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కియారా అద్వాని ఇప్పుడు చరణ్‌ తో రొమాన్స్ చేయనుంది.

అలాగే సరైనోడు సినిమాకు టెరిఫిక్ విజువల్స్ అందించిన రిషి పంజాబి ఈ సినిమాకు సినిమాటోగ్రాఫీ అందిస్తున్నారు. కాకపోతే సంగీతం విషయానికొస్తే.. థమన్ బాబు లైన్లోకి వస్తాడని అనుకుంటే.. దర్శకుడు మాత్రం దేవిశ్రీప్రసాద్ తో వెళదాం అన్నాడట. ఆ విధంగా డిఎస్పీ రంగస్థలం తరువాత మళ్లీ వెంటనే చరణ్‌ తో టీమప్ అయిపోయాడు. మొత్తానికి చరణ్‌ రచ్చ ఆ విదంగా షురూ అయ్యింది. ఇకపోతే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను హీరో లేకుండానే తీసేసి.. రెండో షెడ్యూల్ లో హీరోతో కలసి వర్క్ చేస్తాడట దర్శకుడు బోయపాటి శ్రీను.
Tags:    

Similar News