హీరో రాజ‌శేఖర్ కు మాతృవియోగం

Update: 2017-09-27 11:06 GMT
ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్ ఇంట్లో విషాదం నెలకొంది. రాజ‌శేఖ‌ర్‌ తల్లి ఆండాళ్ వరధరాజన్ బుధ‌వారం హైదరాబాద్‌ లో కన్నుమూశారు. ఆమె వయసు 82 ఏళ్లు. ఆమె కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌ లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివ దేహాన్ని సాయంత్రం 5 గంటల వరకు అపోలో ఆసుపత్రిలో ఉంచుతారు. అనంతరం చెన్నైకి తరలించి, అక్కడ ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఆండాళ్ మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. రాజ‌శేఖ‌ర్‌ స్నేహితులు - శ్రేయోభిలాషులు - సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు రాజశేఖర్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ఆండాళ్ మృతికి వారు సంతాపం వ్యక్తం చేశారు. హీరో మంచుమ‌నోజ్ ట్విట్ట‌ర్ ద్వారా త‌న సంతాపాన్ని తెలిపాడు. రాజశేఖర్ గారి తల్లి మరణ వార్త విని చాలా బాధపడ్డానని మనోజ్ ట్వీట్ చేశాడు. ఆమె మృతికి తన సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నానని, ఆమె ఆత్మకు శాంతి చేకూరలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు. ఆండాళ్‌ కు రాజశేఖర్‌ తో పాటు మరో ఇద్దరు కుమారులు - ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆండాళ్‌ కు రాజశేఖర్ రెండో కుమారుడు. రాజశేఖర్ స్వస్థలం తమిళనాడులోని థేని జిల్లా లక్ష్మీపురం. ఆయ‌న‌ సినిమాల్లోకి వచ్చిన తరవాత చెన్నైలో స్థిరపడ్డారు.

Full View
Tags:    

Similar News