అదిరిపోయేలా ‘రాధేశ్యామ్’ క్లైమాక్స్ ఫైట్.. హాలీవుడ్ డైరెక్టర్ నిక్ పావెల్ పర్యవేక్షణ
యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా.. అంటూ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ వస్తే ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. పాన్ఇండియా మూవీగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ లో అందాల తార పూజాహెగ్డే హీరోయిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. యువదర్శకుడు, జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ నిర్మాణసంస్థ యూవీ క్రియేషన్స్ తాజాగా ఓ వార్తను అభిమానుల చెవుల్లో పడేసింది. అదేంటంటే ‘రాధేశ్యామ్’ క్లైమాక్స్ సన్నివేశాలు హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఉండ బోతున్నాయనట.
ప్రఖ్యాత హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ పర్యవేక్షణలో ఈ సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. గతంలో కంగనా నటించిన మణికర్ణిక చిత్రానికి కూడా నిక్ ఫైట్లను అద్భుతంగా తీశారు. తాజాగా రాధేశ్యామ్కు నిక్ ఫైట్లను రూపొందిస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బాహుబలిలోనూ యాక్షన్ ఘట్టాలు అదిరిపోయిన సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ కోసం హైదరాబాద్లోని రామోజీఫిల్మ్సిటీలో ప్రత్యేక సెట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే రెండు విభిన్నపాత్రల్లో నటించనున్నట్టు టాక్. ఈ చిత్ర కథపై ఇప్పటికే పలు పుకార్లు ఉన్నాయి. సోషియోఫాంటసీ చిత్రంగా తెరకెక్కనున్నట్టు టాక్. ప్రభాస్ కూడా రెండు విభిన్నపాత్రల్లో అలరించనున్నాడట.
ఈచిత్రం పూర్తయ్యాక ప్రభాస్ మహానటి ఫేం నాగ్అశ్విన్ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీలో నటించనున్నారు. ఆ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్నది. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. దీంతో పాటు హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే చిత్రంలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. ప్రభాస్ రాముడిగా కనిపిస్తారని టాక్.. విలన్గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ను ఎంపిక చేశారు. మొత్తం మీద మరో ఐదారేళ్ళ పాటు ప్రభాస్ వివిధ ప్రాజెక్టుల తో బిజీగా ఉండ బోతున్నారన్నమాట. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగి పోయింది. సాహో దక్షిణాదిన ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ.. బాలీవుడ్లోమాత్రం భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ అభిమానులకు మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్ ఏ సినిమా తీసినా పాన్ఇండియా చిత్రాలుగానే తెరకెక్కుతున్నాయి.
ప్రఖ్యాత హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ పర్యవేక్షణలో ఈ సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. గతంలో కంగనా నటించిన మణికర్ణిక చిత్రానికి కూడా నిక్ ఫైట్లను అద్భుతంగా తీశారు. తాజాగా రాధేశ్యామ్కు నిక్ ఫైట్లను రూపొందిస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బాహుబలిలోనూ యాక్షన్ ఘట్టాలు అదిరిపోయిన సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ కోసం హైదరాబాద్లోని రామోజీఫిల్మ్సిటీలో ప్రత్యేక సెట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే రెండు విభిన్నపాత్రల్లో నటించనున్నట్టు టాక్. ఈ చిత్ర కథపై ఇప్పటికే పలు పుకార్లు ఉన్నాయి. సోషియోఫాంటసీ చిత్రంగా తెరకెక్కనున్నట్టు టాక్. ప్రభాస్ కూడా రెండు విభిన్నపాత్రల్లో అలరించనున్నాడట.
ఈచిత్రం పూర్తయ్యాక ప్రభాస్ మహానటి ఫేం నాగ్అశ్విన్ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీలో నటించనున్నారు. ఆ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్నది. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. దీంతో పాటు హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే చిత్రంలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. ప్రభాస్ రాముడిగా కనిపిస్తారని టాక్.. విలన్గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ను ఎంపిక చేశారు. మొత్తం మీద మరో ఐదారేళ్ళ పాటు ప్రభాస్ వివిధ ప్రాజెక్టుల తో బిజీగా ఉండ బోతున్నారన్నమాట. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగి పోయింది. సాహో దక్షిణాదిన ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ.. బాలీవుడ్లోమాత్రం భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ అభిమానులకు మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్ ఏ సినిమా తీసినా పాన్ఇండియా చిత్రాలుగానే తెరకెక్కుతున్నాయి.