ఆ హీరోకి రాశీఖన్నా అలా పంచ్ ఇచ్చిందా?

Update: 2016-05-05 06:11 GMT
ఒక కుర్రహీరోకి.. ఒక హీరోయిన్ తో ఎదురైన షాకింగ్ వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. అయితే.. దీని గురించి సదరు హీరోనే బయటకు చెప్పటం మరో విశేషం. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ స్క్రీన్ మీద ఎంత చలాకీగా.. హుషారుగా ఉంటారో తెలిసిందే కదా. ఇతగాడు సుప్రీం సినిమా షూటింగ్ సమయంలో రాశీఖన్నా నుంచి ఊహించని పంచ్ ఒకటి తిన్నారు.

ఈ సినిమాలో చిరంజీవి నాటి హిట్ సాంగ్ ‘‘అందం హిందోళం.. అధరం తాంబూలం’’ పాటను సుప్రీం చిత్రంలో వాడుకోవటం తెలిసిందే. ఈ పాటకు స్టెప్పుల విషయంలో కాస్త ఇబ్బంది పడ్డారు. అంత మంచి పాటను తాము ఏమాత్రం చెడగొట్టినా పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయన్న టెన్షన్ హీరో.. హీరోయిన్లలో ఉన్నా.. కొరియోగ్రాఫర్ పుణ్యమా అని పెద్దగా ఇబ్బంది పడకుండానే పాట మొదటి రోజు షూటింగ్ పూర్తి చేశారట.

మొదటిరోజు స్టెప్పుల వేసిన తీరుతో వచ్చిన కాన్ఫిడెన్స్ తో సెట్ లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. తన మాదిరే టెన్స్ లో ఉన్న రాశీఖన్నా దగ్గరకు వెళ్లి.. నువ్వేం భయపడకు.. నిన్న మనం బాగా డ్యాన్స్ చేశాం. ఈ రోజు బాగానే చేస్తాం.. టెన్షన్ పడొద్దని ఉత్సాహపరిచేలా నాలుగు మాటలు చెప్పాడట. అతడి మాటలన్నీ విన్న రాశీఖన్నా.. స్టెప్పులు బాగా వేసిన విషయం తనకు తెలుసని కూల్ గా చెప్పేసిందట. దీంతో.. రాశీఖన్నాకు ఎలా సమాధానం ఇవ్వాలో అర్థం కాక మనోడు బ్లాంక్ ఫేస్ పెట్టేశాడట. రాశీఖన్నాలో యకసకాలు చాలానే ఉన్నాయే..?
Tags:    

Similar News