50 వదిలేసి ఘాజీ చేశాడట

Update: 2017-02-19 07:46 GMT
దగ్గుబాటి రానా నటించిన ఘాజీ మూవీ దిగ్విజయంగా థియేటర్లలో ఆడేస్తోంది. మూడు భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం అంచనాలను మించి వసూళ్లు రాబడుతోంది. కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి తీసిన ఈ చిత్రం ఇంత భారీ విజయం సాధించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అయితే, ఇందులో మొత్తం టీం కృషిని అభినందించాలి. సినిమా అంతా సబ్‌ మెరైన్‌ లోనే ఉన్నా.. ఎనెన్నో డిఫరెంట్ యాంగిల్స్ నుంచి షూట్ చేసి, రిపీటెడ్ సీన్స్ చూస్తున్నామనే ఫీలింగ్ కలగకుండా పిక్చరైజ్ చేసిన సినిమాటోగ్రాఫర్ మాధీని ప్రశంసించాల్సిందే. గతంలో శర్వానంద్ మూవీ రన్ రాజా రన్.. మహేష్ బాబు సినిమా శ్రీమంతుడు చిత్రాలకు వర్క్ చేసిన మాధీకి ఆ తర్వాత బోలెడంత డిమాండ్ ఏర్పడింది. అయితే.. వాటన్నిటినీ పక్కన పెట్టి ఘాజీ చిత్రానికి డెడికేటెడ్ గా వర్క్ చేశాడు మాధీ.

ఘాజీ ప్రమోషన్స్ లో పాల్గొన్న మాధీ.. 'శ్రీమంతుడు తర్వాత నాకు చాలానే ఆఫర్స్ వచ్చాయి. కానీ నేను వాటిని ఘాజీ కోసం తిరస్కరించాను. దాదాపు 50 సినిమాలను వదులుకుని ఉంటాను. నేను ఎప్పుడూ డబ్బుకోసం వెంపర్లాడలేదు. సినిమాటోగ్రాఫీ అనేది నా ప్యాషన్' అని చెప్పాడు మాధీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News