మగధీరను ఎలా నాశనం చేస్తాడో!!

Update: 2016-10-25 08:27 GMT
ఇప్పుడు టాలీవుడ్ లో ఏ నోట విన్నా కూడా ఒకటే మాట వినిపిస్తోంది. అయో రాజమౌళి అండ్ రామ్ చరణ్ ఎంతో కష్టపడి ''మగధీర'' సినిమాను చేశారు.. ఇప్పుడు ఆ సినిమాను ఎలా పాడు చేస్తారో ఏంటో అంటూ అందరూ కంగారుపడుతున్నారు. అసలు సడన్ గా మనోళ్లు ఇలా మగధీర గురించి రచ్చ చేస్తున్నారేంటో అనుకుంటున్నారా.. పదండి ఆ కథేంటో చూద్దాం.

చాలా రోజుల క్రితం.. సారీ సంవత్సరాల క్రితమే.. హీరో షాహిద్ కపూర్ 'మగధీర' బాలీవుడ్ రీమేక్ లో నటిస్తున్నాడని వార్తలొచ్చాయి. అయితే మనోడు మాత్రం అప్పట్లో నాకు అలాంటి ఉద్దేశ్యం లేదంటూ కొట్టిపారేశాడు. కాని కాలక్రమేణా అన్నీ ఫ్లాపులొస్తున్న వేళ.. ఇతగాడి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు 'మగధీర' హిందీ రీమేక్ చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఆ సినిమాను ఎవరు డైరక్టర్ చేస్తారు మరి? ఇంకెవవ్వరూ.. రీమేక్ రాజా అయిన ప్రభుదేవా ఉన్నాడుగా. పైగా మనోడు షాహిద్ కపూర్ కు మాంచి ఫ్రెండ్ కూడా. కాకపోతే కొన్ని రీమేక్ సినిమాలతో ప్రభుదేవా మాంచి హిట్టే కొట్టినా కూడా.. ఎందుకో ఒరిజినల్ సినిమాలో ఉన్న ఎసెన్స్ ను సరిగ్గా తీయలేక నాశనం చేస్తాడనే రిమార్క్ ఉంది. అందుకే ఇప్పుడు మగధీరను ప్రభుదేవా టచ్ చేస్తున్నాడంటే టాలీవుడ్ జనాలకు భయంగా ఉంది.

అయితే ఇప్పటికే మగధీర కు దగ్గర్లో ఉన్న స్టోరీ లైన్ తో బాలీవుడ్ లో కూడా మీర్జియా వంటి సినిమాలొచ్చాయి. అవన్నీ ఫ్లాపులే. పైగా మగధీర కూడా వాళ్లకు ఓం శాంతి ఓం సినిమాను మళ్లీ చూసినట్లు ఉంటుంది. అలాంటప్పుడు ఈ కథ అక్కడ ఎంతవరకు వర్కవుట్ అవుతుంది అనేదే చూడాల్సిన విషయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News