ఫ్యాన్స్ తో డీజే భామ సెల్ఫీ

Update: 2017-08-20 05:21 GMT
ఒక్కోసారి హీరోయిన్స్ ఎంత అందంగా ఉన్నా వారి దురదృష్టం వల్ల హిట్స్ అందుకోలేకపోతారు. ఎంత కష్టపడినా వరుస ఫెయిల్యూర్స్ వస్తుండడంతో మరింత కష్టపడేందుకు కృషి చేస్తారు. ఇప్పుడు ఓ సౌత్ భామ పరిస్థితి అలానే ఉంది. ఆమె ఎవరో కాదు దువ్వడా జగన్నాథమ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే.

ముకుందా సినిమాతో డీసెంట్ గర్ల్ గా ఆకట్టుకున్నా డీజే లాంటి సినిమాలో బికినీతో అలరించినా ఈ భామ భారీ ఛాన్సులు మాత్రం అందుకోవడం లేదు. ఆఖరికి హృతిక్ రోషన్ లాంటి బాలీవుడ్ నటుడితో నటించినా కూడా లాభం లేకపోయింది. అయితే ప్రస్తుతం కెరీర్ గురించి పక్కనపెట్టి ఈ భామ ఈవెంట్స్ కి వెళ్లి జనాల్లో కాస్త పాపులారిటీ సంపాదించుకుంటోంది. రీసెంట్ గా విజయవాడలోని ఓ మొబైల్స్ షో రూమ్ ని లాంచ్ చేసింది ఈ డీజే సుందరి. ఆమె రాకను గమనించిన చాలా మంది యువకులు అక్కడికి చేరుకున్నారు.

అంతే కాకుండా పూజను కలిసేందుకు కొందరు తీవ్రంగా శ్రమించారు కూడా.. ఒక్క ఫోటో అని అడుగుతుండడంతో  పూజ వారి అభిమానానికి ఫిదా అయిపొయింది. వెంటనే అందరితో ఫొటోలు దిగుతానంటూ.. అక్కడున్న అభిమానులతో తానే సెల్ఫీ తీసుకొని వారి కోరికను ఒకేసారి తీర్చేసింది. దీంతో అక్కడున్న అభిమానులు పూజకు థాంక్స్ చెప్పారు. 
Tags:    

Similar News