ఒక్క దెబ్బ‌కు మంట‌లు పెట్టిన బుట్ట‌బొమ్మ‌

Update: 2020-12-16 14:28 GMT
ఈ ఏడాది ఆరంభంలో `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది పూజా హెగ్డే. బ‌న్నీ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ సంక్రాంతి బ‌రిలో నిలిచి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ‌గా నిలిచింది. ఈ మూవీ త‌రువాత పూజా హెగ్డే మ‌రింత పాపుల‌ర్ అయిపోయింది. క‌రోనా కార‌ణంగా రెమ్యున‌రేష‌న్స్ త‌గ్గించుకోవాల్సిందే అని నిర్మాత‌లు చెబుతున్నా పూజా హెగ్డే మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.

ఎక్స్ పోజింగ్ విష‌యంలోనూ ఎలాంటి హ‌ద్దులు చెప్ప‌న‌ని ఓపెన్ ‌గా చెప్పేస్తున్న పూజా హెగ్డే తాజాగా సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ ఫొటో వైర‌ల్ ‌గా మారింది. `అల వైకుంఠ‌పురంలో` చిత్రంలో కాళ్ల ఫాంట‌సీ ఏంట‌య్యా అంటూ లెగ్స్ చూపించి కుర్ర‌కారుకి నిత్ర‌లేకుండా చేసిన పూజా తాజా ఫొటోలో మాత్రం బికినీ ధ‌రించి క‌వ్విస్తుండ‌టం షాకిస్తోంది.

పూజా లేజీ గా అలా క‌వ్విస్తూ ఉన్న ఫోటోని చూసిన ఫ్యాన్స్ హీటెక్కిపోతున్నారంతే. ఆల్మోస్ట్ ప‌రిమిత వ‌లువ‌ల‌తో అర్థ‌న‌గ్నంగా క‌నిపించి అభిమానుల‌కు షాకిచ్చింది పూజా. ప్ర‌స్తుతం పూజా హెగ్డే `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` చిత్రంలో న‌టిస్తోంది. అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News