మాతాజీ అవతారంలో ఊసరవెల్లి భామ

Update: 2018-04-19 04:55 GMT
ఎన్టీఆర్ మూవీ ఊసరవెల్లిలో హీరోయిన్ తమన్నా ఫ్రెండ్ పాత్రలో నటించిన భామ పాయల్ ఘోష్. చివరలో విలన్ చేతిలో చనిపోయే పాత్ర. ఇప్పుడీ బ్యూటీ బాలీవుడ్ షిఫ్ట్ అయిపోయింది. వరుసగా సినిమాలు అందుకుంటూ హిందీ ఫీల్డ్ లో సెటిల్ అయిపోవడానికి గట్టిగానే ట్రై చేస్తోంది.

గతేడాది 'పటేల్ కి పంజాబి షాదీ' మూవీలో నటించింది పాయల్ ఘోష్. రిషీ కపూర్.. పరేష్ రావల్ వంటి ట్యాలెంటెడ్ ఆర్టిస్టులతో చేసిన మూవీ కావడంతో.. ఈమెకు కూడా మంచి గుర్తింపే వచ్చింది. అప్పుడే ఈమె బాలీవుడ్ లో రెండో ఆఫర్ కూడా అందేసుకుంది. అంతేకాదు.. ఈ చిన్నదానికి ఏకంగా లీడ్ హీరోయిన్ ఆఫర్ వచ్చేసింది. 'జై మాతా దీ' అంటూ తెరకెక్కనున్న సినిమాలో పాయల్ ఘోష్ ను మెయిన్ హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నాడు మిక్కీ వైరస్ దర్శకుడు సౌరభ్ వర్మ. పటేల్ కి పంజాబి షాదీలో ఈమె పెర్ఫామెన్స్ నచ్చడంతోనే తాను ఈమెను మెయిన్ హీరోయిన్ చేసుకున్నట్లు చెబుతున్నాడు. ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో సాగుతుందట.

అయితే.. వివాదాస్పద మాతాజీ గా గుర్తింపు పొందిన రాధే మా జీవితం ఆధారంగానే ఈ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారనే టాక్ ఉంది. ఆ విషయాన్ని పైకి చెప్పడం లేదు కానీ.. తనకు మాత్రం ఇదే బెస్ట్ రోల్ ఆఫర్ అంటోంది పాయల్ ఘోష్. ఇప్పటివరకూ తన దగ్గరకు వచ్చిన వాటిలో.. తనకు లైఫ్ టర్నింగ్ ఇచ్చే రోల్ ఇదే అని తెగ నమ్మకంగా ఉంది. ఆగస్టులో జైమాతా దీ షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఇంకా హీరోను ఫైనలైజ్ చేయాల్సి ఉంది.
Tags:    

Similar News