పాయల్‌ ఎటు పయనమైందో...

Update: 2015-08-03 06:36 GMT
పాయల్‌ ఘోష్‌ .. ముంబై భామ. అందరు ముంబై ముద్దుగుమ్మల్లానే టాలీవుడ్‌ లో అడుగుపెట్టింది. ఆరంభమే చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో పయనం చిత్రంలో నటించింది. మంచు మనోజ్‌ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. ఓ ఎయిర్‌ పోర్ట్‌ లో అనూహ్యంగా అమ్మాయి అబ్బాయి పరిచయం అవుతారు. విమానం టేకాఫ్‌ అయ్యే లోగా ఆ ఇద్దరిమధ్యా ఏం జరిగింది? అన్నదే కథాంశం. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించినంత విజయం సాధించలేదు.

దాంతో పాయల్‌ చిన్నా చితకా ప్రాజెక్టులతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. కొన్ని సినిమాల్లో నటించాక .. బ్రేక్‌ రాక ఇతర భాషల్లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్ లో కూడా నటించింది. అయిన పెద్దగా లాభం లేదు. క్రమంగా టాలీవుడ్‌ కి దూరమైంది. ఇటీవలే ఈ అమ్మడు నటించిన మలయాళ చిత్రం మున్నారియిప్పు కి ఉత్తమ ఫిలింఫేర్‌ అవార్డు వచ్చింది. ఇదిగో ఇప్పుడు బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. పటేల్‌ కి పంజాబీ షాదీ అనేది ఈ సినిమా టైటిల్‌. ఇదో ఆసక్తికరమై థ్రిల్లర్‌ స్టోరి. నాయిక ప్రధానంగా కథాంశం సాగుతుంది. ఈ సంగతిని ఎంతో మురిపెంగా చెబుతోంది పాయల్‌. ఇలాంటి అవకాశం ఓ డెబ్యూ నాయికగా తనకి రావడంపై సంతోషంగా ఉన్నానని చెప్పింది.
Tags:    

Similar News