లండన్ లో పవన్ అలా సందడి చేశాడు

Update: 2017-11-17 18:08 GMT
టాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో పూర్తిగా కొనసాగడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కూడా. తన వరకు వస్తున్న ప్రతి సమస్యపై పవన్ తనదైన శైలిలో స్పందిస్తూ ముందుకు వెళుతున్నాడు.

అయితే రీసెంట్ గా పవన్ లండన్ కి వెళ్లారు. అక్కడ అభిమానులను కలుసుకున్న పవన్ వారితో మాట్లాడారు. ఇక అక్కడ జనసేన కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు. అయితే ఈ పర్యటనలో ప్రఖ్యాత ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరమ్‌ అందించే ఎక్సలెన్సీ అవార్డును పవన్ కళ్యాణ్ అందుకొనున్నారు. అంతేకాకుండా ఆ తర్వాత జరగబోయే కార్యక్రమాల్లో పాల్గొని గ్లోబల్‌ ఇన్వెస్టుమెంట్‌ న్యూ ఇండియా సదస్సులో భాగంగా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు అనే విషయం గురించి మాట్లాడారు. అంతే కాకుండా యూరప్‌ లోని ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులతోనూ పవన్ సమావేశం అవుతారు. ఈలోపు అక్కడి అంబేద్కర్ మొమోరియల్ ను సందర్శించి.. అక్కడగల విశేషాలను తెలుసుకున్నారు.

ఈ పర్యటనలో పవన్ చాలా బిజీగా ఉన్నాడు. ఈ షెడ్యూల్ మొత్తాన్ని  అలాగే కార్యక్రమాలను ఐఈబీఎఫ్‌ నిర్వాహకులు చూసుకుంటున్నారు. ఇక పవన్ ప్రస్తుతం నటిస్తోన్న తన 25వ సినిమా కూడా దాదాపు ఏండింగ్ కు వచ్చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది.
Tags:    

Similar News