పవన్ కళ్యాణ్ ఆ రిమేక్ లో నటించట్లేదా?

Update: 2020-10-20 02:30 GMT
మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పన్ కోషియమ్’ సినిమా రిమేక్ హక్కులను నిర్మాత సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాను స్టార్ హీరోలతో చేయాలని ఆయన ప్లాన్ చేశాడు. మొదట ఈ సినిమా అగ్ర హీరో నందమూరి బాలయ్య దగ్గరికి వెళ్లింది. అయితే ఈ సినిమాపై బాలయ్య ఆసక్తి చూపించకపోవడంతో పలువురు హీరోల చుట్టూ తిరిగింది.

ఈ సినిమాను సితారా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తెలుగులో రిమేక్ చేయబోతోంది.మొదట ఈ సినిమాలో రవితేజ అండ్ రానా కలిసి నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ రిమేక్ పై పవన్ ఆసక్తి చూపిస్తున్నాడని.. పవన్ ను చిత్రబృందం కలిసిందని సమాచారం. పవన్ ఈ సినిమాకు ఒప్పుకున్నాడని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రవితేజనే నటించబోతున్నట్టు తెలిసింది. రవితేజ, రానా ఇద్దరూ వచ్చే ఏడాది నుంచి ఈ రిమేక్ లో పాల్గొంటారని టాలీవుడ్ సమాచారం.

ఇందులో పోలీస్ గా రవితేజ.. మరో హీరో పాత్రలో రానా నటిస్తాడు. సూపర్ హిట్ అయిన ఈ చిత్రంపై టాలీవుడ్ లోనూ బోలెడు అంచనాలున్నాయి.
Tags:    

Similar News