ఎన్టీఆర్... సమ సమాజ్ పార్టీకి ‘జై’

Update: 2017-07-23 07:12 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టేశాడు.. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు... ఆల్రెడీ క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ చేసేశాడు..  ఇదేంటి ఎన్టీఆర్ బిగ్ బాస్ ప్రోగ్రాం చేస్తూ బిజీగా ఉన్నాడు కదా.. పార్టీ ఎప్పుడు పెట్టేశాడనే డౌటొచ్చింది. పార్టీ పెట్టింది రియల్ గా కాదు. రీల్ కోసమే.

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ జై లవకుశ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఇప్పటికే విడుదల చేశారు. విలన్ జై పాత్రలో ఎన్టీఆర్ అభినయం అభిమానులకు ఎంతగానో నచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి తాజా విశేషం షూటింగ్ లో భాగంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్ గా సత్తా చూపించనున్నాడు. సమ సమాజ్ పార్టీ పేరిట ఎలక్షన్ బరిలో దిగుతున్నాడు. ఎన్టీఆర్ అనుచరులతో కలిసి పొలిటికల్ క్యాంపెయిన్ చేస్తున్న షూట్ కు సంబంధించిన ఫొటోలు ఇటీవల బయటకొచ్చాయి.

ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాతగా నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై జై లవకుశ తెరకెక్కుతోంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి డైరెక్టర్ బాబీ అభిమానులకు సర్ ప్రైజులు ఇస్తూనే ఉన్నాడు. తాజాగా విలన్ పాత్రధారికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ పెట్టి సినిమాపై బజ్ మరింత పెంచేశారు. కరకుదనం  -క్రౌర్యం నిండిన ఈ పాత్రలో తారక్ చెలరేగిపోవడం ఖాయం. ఇంతవరకు జై ఒక్కడి పాత్రే రివీల్ చేశారు. లవ - కుశ పాత్రలు కూడా రివీల్ చేస్తే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News