అల్లు వారితో కలుస్తున్న బిజినెస్ మ్యాన్‌

Update: 2016-05-30 05:49 GMT
నిమ్మగడ్డ ప్రసాద్.. బిజినెస్ మ్యాన్‌ కమ్‌ మా టీవీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఈయనకు.. సినీ రంగంలోనూ సత్తా చాటాలనే కోరిక చాలా రోజులుగా ఉంది. అయితే నేరుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసేందుకు బదులుగా.. ఇప్పటికే బ్రాండ్ వాల్యూ ఉన్న సంస్థలతో కలిసి ప్రొడక్షన్ చేయాలని చూస్తున్నారు. అలాగే మొబైల్ ప్లాట్ ఫామ్స్ కు కంటెంట్ జనరేషన్ ప్రాజెక్టు కూడా ప్రారంభించనున్నారు.

ప్రస్తుతం హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ ను పరిచయం చేస్తున్న సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు నిమ్మగడ్డ. ఈ నిర్మలా కాన్వెంట్ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిపి నిర్మిస్తున్నారు. గతంలో కూడా మాటీవీలో ఈయనకు, నాగార్జునకు భాగస్వామ్యం ఉంది. అలా అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి సినీ నిర్మాణంలో తొలి అడుగు వేసిన ఈయన.. సుదీర్ఘ భాగస్వామ్యం కోసం అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు.

అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ తో కలిసి వరుసగా సినిమాలు నిర్మించనున్నారట నిమ్మగడ్డ. మాటీవీలో నాగ్ తో పాటు చిరు - అల్లులతో కలిపి అనుబంధం - భాగస్వామ్యం నిమ్మగడ్డకు ఉన్నాయి. ప్రస్తుతం అల్లు-నిమ్మగడ్డ చర్చలు నడుస్తున్నాయని.. త్వరలో వీరి భాగస్వామ్యంపై అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News