బయటకు వెళ్లాలంటేనే భయం.. దాడి భయంతో నటిలో వణుకు

Update: 2021-12-04 02:30 GMT
ఇటీవల బహిరంగ ప్రదేశాలకు వస్తున్న హీరోయిన్లపై దాడులు ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ నటి చౌరాసియాపై దాడి ఘటన మరువకముందే ఇటీవల ఓ బాలీవుడ్ నటిపై కూడా దాడి జరగడం కలకలం రేపింది. పలు సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటి నికితా దత్తాపై కూడా దుండగులు దాడి చేసి ఆమె సెల్ ఫోన్ లాక్కెళ్లారు. నటి వాకింగ్ చేస్తుండగా ఈ దాడి జరిగింది.

ఈ దాడి అనంతరం తన పరిస్థితిపై నటి నికితా దత్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. నాపై దాడి చేసి దుండగులు ఫోన్ లాక్కెళ్లారని.. ఇప్పటివరకూ తన ఫోన్ తిరిగి లభించలేదని ఆమె వాపోయింది. ఆ ఘటన జరిగిన రోజు అసలు నిద్రపోలేదని తెలిపింది.

నాపై దాడి జరిగిన ఘటన నిజంగా భయంకరం.. నాకు నా ఫోన్ దొరుకుతుందన్న నమ్మకం కూడా పోయిందని నటి నికితా దత్తా ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ దాడి తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే కూడా భయంగా ఉందని తెలిపింది. సాధారణ వాకింగ్ చేయడం అంటే నాకిష్టమని.. కానీ ధైర్యం చేసి నేనిప్పట్లో బయటకు వెళ్లలేనని వివరించింది. అదంతా మంచిదని కూడా అనిపించడం లేదని వాపోయింది. దీన్నొక పీడకలగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నానని..మీ అందరికీ చెప్పేదొక్కటేనని.. రోడ్డు మీదనప్పుడు మీరు ఫోన్ వాడుతూ.. చాట్ చేస్తూ.. మెసేజ్ లు చేస్తూ మునిగిపోవద్దని నటి హితవు పలికింది.

నికితా దత్తా బయట వాకింగ్ చేస్తూ ఫోన్ లో చాట్ చేస్తూ వెళుతుండగా కొంత మంది దుండగులు వచ్చి ఆమెపై దాడి చేసి ఫోన్ లాక్కొని వెళ్లిపోయారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకూ కేసు పురోగతి లేదు. ఆమె ఫోన్ దొరకలేదు.
Tags:    

Similar News