'థగ్ లైఫ్' లో మీర్జాపూర్ స్టార్ల‌ ఎంట్రీ!

మ‌ణిర‌త్నం ఒక సినిమాని తెర‌కెక్కిస్తున్నారు అంటే దానిపై అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో చ‌ర్చ సాగుతుంది.

Update: 2024-04-30 07:02 GMT

మ‌ణిర‌త్నం ఒక సినిమాని తెర‌కెక్కిస్తున్నారు అంటే దానిపై అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో చ‌ర్చ సాగుతుంది. అది కూడా విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తో ఆయ‌న జ‌త క‌లిసారంటే ఆ సెన్సేష‌న్ ఎలా ఉంటుందో ఊహించ‌గ‌లం. ఆ ఇద్ద‌రూ ఇంత‌కుముందు నాయ‌గ‌న్ (నాయ‌కుడు) చిత్రానికి క‌లిసి ప‌ని చేసారు. అది అప్ప‌ట్లో ఒక సెన్సేష‌న్.

ఇప్పుడు `థ‌గ్ లైఫ్` కోసం క‌లిసి ప‌ని చేస్తున్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ .. ద‌ర్శ‌కుడు మణిరత్నం థగ్ లైఫ్ ని భారీ పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ లో ఉంది. ఇందులో త్రిష కృష్ణన్ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. తాజా స‌మాచారం మేర‌కు.. న్యూ ఢిల్లీలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ సెట్లో బాలీవుడ్ తార‌లు అలీ ఫజల్ - పంకజ్ త్రిపాఠి తారాగణంలో చేరుతున్నార‌ని గుస‌గుస వినిపిస్తోంది.

ఈ ఇద్దరూ బ్లాక్ బ‌స్ట‌ర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్‌లో న‌టించారు. సిరీస్ లో వారి న‌ట‌న‌కు మంచి గుర్తింపు ద‌క్కింది. అందుకే ఇప్పుడు మ‌ణి స‌ర్ థ‌గ్ లైఫ్‌లో చేరుతున్నారు అన‌గానే ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. అలాగే నవాబ్ ఫేం శింబు కూడా థ‌గ్ లైఫ్ లో జాయిన‌వుతున్నార‌ని క‌థ‌నాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రాన్ని కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి, గౌతం కార్తీక్, దుల్కర్ సల్మాన్, నాజర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ సినిమాకి స్వ‌ర‌సంచ‌ల‌నం ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Read more!

వైదొలిగిన స్టార్లు:

నిజానికి ఓకే బంగారం ఫేం దుల్క‌ర్ స‌ల్మాన్ కి మ‌ణిర‌త్నం ఈ క్రేజీ ప్రాజెక్టులో అవ‌కాశం క‌ల్పించారు. కానీ అత‌డు మిడిల్ డ్రాప్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత థ‌గ్ లైఫ్ కాస్టింగ్ మార్పుపై చాలా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో దుల్క‌ర్ ఓకే బంగారం చిత్రంలో న‌టించినప్ప‌టి నుంచి మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేయాలనుకున్నా వీలు ప‌డ‌లేదు. జ‌యం ర‌వి ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నార‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

Tags:    

Similar News