పానీ పూరి పవన్ హీరోయిన్ కు దెబ్బేసింది

Update: 2017-01-24 05:13 GMT
పవన్ కళ్యాణ్ సరసన కొమరం పులి కనిపించిన భామ నికీషా పటేల్. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పవర్ స్టార్ హీరోయిన్ అనే స్టాంప్ ఉన్నా.. పెద్దగా ప్రయోజనం లేకపోయింది. తమిళ.. కన్నడ సినిమాలు చేస్తున్న నికీషా.. ఇప్పుడు సడెన్ గా ఆస్పత్రి పాలైంది. హాస్పిటల్ నుంచి ఫోటోలు షేర్ చేయడమే కాకుండా.. మంగమ్మ శపథం టైపులో ఓ పెద్ద డెసిషన్ తీసేసుకున్నా అంటోంది.

ఇంతకీ అసలేం జరిగిందంటే.. నికీషా పటేల్ కి పానీ పూరీ అంటే పిచ్చిపిచ్చిగా ఇష్టం. కార్ లో వెళుతూ కూడా.. రోడ్డు పక్కన పానీపూరీ బండి కనబడితే.. కారు ఆపి దిగి తినేస్తూ ఉంటుందట. ఇప్పుడదే ఫుడ్ ఈమెను ఆస్పత్రి పాలు చేసింది. ఆమె తిన్న పానీపూరీ కారణంగా ఫుడ్ పాయిజన్ కావడంతో..  ఇప్పుడు హాస్పిటల్ లో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఇకపై పానీపూరీ తినబోనంటూ శపథం చేసేస్తోంది నికీషా. సెలైన్ ఎక్కిస్తున్న చేతి ఫోటోను కూడా తీసి నెట్ లో పెట్టింది.

ఇకపై పానీ పూరీ తినబోనని చెప్పడం సరదాగా కాదంటున్న నికీషా పటేల్.. చాలా సీరియస్ గా ఈ నిర్ణయం తీసుకున్నానని అంటోంది. గతంలో నేను తిండిబోతుని గర్వంగా అనౌన్స్ చేసిన నికీషా పటేల్.. పానీపూరీ శపథం మాత్రం జీవితంలో మర్చిపోదట.  ఇక సినిమాల విషయానికి వస్తే.. అరకు రోడ్ లో అనే థ్రిల్లర్ లో పులి బ్యూటీ కనిపించగా.. గుంటూరు టాకీస్ పార్ట్2 లో ఆఫర్ దక్కించుకుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News