కత్తి - బాబు గోగినేనిపై నాగబాబు ఫైర్

Update: 2018-07-08 16:55 GMT
మెగా ఫ్యామిలీలో అంతా సినిమాలపైనో లేదంటే రాజకీయాల పైనో దృష్టి పెడుతుంటే నాగబాబు మాత్రం హిందూ ధర్మ పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడేవారిని శిక్షించాలంటూ ఆయన డిమాండు చేస్తున్నారు. హిందూ దేవుళ్లను - ధర్మాన్ని అవమానిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశీయులు కూడా మన ధర్మం పట్ల ఆసక్తి పెంచుకుంటుంటే మనం మాత్రం తృణీకరిస్తున్నామంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
  
నాస్తికత్వం - హేతువాదం పేరుతో బాబు గోగినేని - కత్తి మహేశ్ వంటివారు రాముడిని - ఇతర దేవుళ్లను అవమానించేలా మాట్లాడుతున్నారని నాగబాబు మండిపడుతున్నారు. ఇటీవల కత్తి మహేశ్ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల సీఎంలను ఆయన ఇప్పటికే డిమాండ్ చేశారు. తాజాగా ఆయన బ్రిటన్ కు చెందిన ఓ చిన్నారిని తీసుకొచ్చి లవకుశ చిత్రంలోని వినుడు వినుడు రామాయణ గాథ పాటను ఆయనతో పాడించారు.
  
బ్రిటన్ వంటి దేశాలకు చెందినవారే మన హిందూధర్మంపై ఇంతగా శ్రద్ధ చూపుతుంటే ఈ దేశంలో పుట్టినవారికి ఏమొచ్చిందంటూ ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు కత్తి మహేశ్ వంటివారిపై చర్య తీసుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని.. ఆ తరువాత జరిగే పరిణామాలకు ఎవరూ బాధ్యులు కారంటూ ఆయన ఇంతకుముందు కూడా హెచ్చరించారు. మొత్తానికి కత్తి వంటివారు హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాగబాబు మాత్రం దీనిపై పోరాడేందుకు సిద్ధమంటున్నారాయన.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View

Tags:    

Similar News