శౌర్య కోసం సవ్యసాచి భామ

Update: 2018-12-08 08:40 GMT
యంగ్ హీరో నాగ శౌర్య 'ఛలో' తో గాడిన పడ్డట్టు అనిపించినా.. తర్వాత రిలీజ్ అయిన సినిమాలు నిరాశపరచడంతో తన నెక్స్ట్ సినిమాల ఎంపికలో జాగ్రత్త పడుతున్నాడు.  ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంతా కీలక పాత్ర పోషిస్తోంది.  ఈ సినిమా కాకుండా మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట శౌర్య.

సుకుమార్ వద్ద గతంలో అసిస్టెంట్ గా పని చేసిన కాశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడు.  కాశి చెప్పిన స్టొరీ నచ్చడంతో ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నిర్మించడానికి సుకుమార్ సిద్దమయ్యాడట.  ఈ సినిమా ఒక రొమాంటిక్ డ్రామా అని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందని.. ఈ సినిమాలో శౌర్యకు జోడీగా నిధి అగర్వాల్ ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. ' సవ్యసాచి' సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధి ప్రస్తుతం అఖిల్ అప్కమింగ్ ఫిలిం 'Mr. మజ్ను' లో హీరోయిన్ గా నటిస్తోంది.  

రెమ్యూనరేషన్.. డేట్స్ విషయాలపై  డిస్కషన్స్ జరుగుతున్నాయట.  అవి ఫైనలైజ్ ఐతే హీరోయిన్ గా పక్కా అయినట్టే.  ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో ఉంటుంది.  సుకుమార్ బ్యానర్ లో సినిమా అంటే ఖచ్చితంగా ట్రెండీగా ఉండే అవకాశం ఉంది.  మరి ఈ సినిమాతో అయినా శౌర్యకు మంచి హిట్ వస్తుందేమో వేచి చూడాలి.
 
Tags:    

Similar News