చేద్దామా.. ఆలోచనల్లో అక్కినేని ఫ్యామిలీ?

Update: 2019-01-11 10:22 GMT
ఈమద్య కాలంలో వరుసగా తెలుగులో బయోపిక్‌ లు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్‌ కూడా వచ్చే అవకాశం ఉందని ఆమద్య వార్తలు వచ్చాయి. బయోపిక్‌ వార్తలపై నాగార్జున పలు సార్లు స్పందిస్తూ ఆ ఆలోచన లేదని తేల్చి పారేశాడు. ఏయన్నార్‌ గారి జీవితం చాలా సాఫీగా సాగింది. ఎలాంటి డ్రామా లేకుండా ఆయన సినీ జీవితం కొనసాగింది. ఒక వేళ బయోపిక్‌ తీస్తే డ్రామా లేదంటూ ప్రేక్షకులు సినిమాను తిరష్కరిస్తారనేది నాగార్జున అభిప్రాయం. ఇప్పుడు ఆ అభిప్రాయంలో మార్పు వచ్చినట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ విడుదలైన తర్వాత ఏయన్నార్‌ బయోపిక్‌ తీద్దాం అంటూ అక్కినేని ఫ్యామిలీలో చర్చ మొదలైందట. ఎన్టీఆర్‌ చిత్రంలో ఏయన్నార్‌ గా సుమంత్‌ పోషించిన పాత్రకు మంచి ఆధరణ దక్కింది. ఉన్నది కొద్ది సేపే అయినా కూడా సుమంత్‌ పాత్ర మంచి ప్లస్‌ అయ్యిందని అంతా అంటున్నారు. ఏయన్నార్‌ జీవితం గురించి ఇంకాస్త ఉంటే బాగుండేది కదా అంటూ ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారని, అందుకే ఏయన్నార్‌ బయోపిక్‌ తీస్తే బాగుంటుందనే అభిప్రాయం ఫ్యామిలీలో వ్యక్తం అవుతోందట.

అక్కినేని ఫ్యామిలీ వారు బయోపిక్‌ విషయంలో ఆసక్తిగా లేరనే వార్తలు పోయి, ప్రస్తుతం ఫ్యామిలీలో చర్చలు జరుగుతున్నట్లుగా ప్రచారం మొదలైంది. అంటే చిన్న స్టెప్‌ అయితే పడ్డట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏయన్నార్‌ బయోపిక్‌ ను చేస్తే సుమంత్‌ తోనే చేయాలనే అభిప్రాయం కూడా అక్కినేని ఫ్యాన్స్‌ లో వ్యక్తం అవుతుంది. సుమంత్‌ అయితేనే ఏయన్నార్‌ అన్ని వయసుల పాత్రలకు సెట్‌ అవుతాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ నుండి ఎలాంటి ప్రకటన వస్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



Full View
Tags:    

Similar News