ఎన్టీఆర్ .. కొరటాల మూవీలో నభా నటేశ్?

Update: 2021-04-21 13:30 GMT
ఇప్పుడు ఫిల్మ్ నగర్లో తాజాగా ఒక వార్త జోరుగా షికారు చేస్తోంది. ఎన్టీఆర్ .. కొరటాల సినిమాలో నభా నటేశ్ కి ఛాన్స్ దక్కనుందనేది ఆ వార్తలోని సారాంశం. ప్రస్తుతం కొరటాల 'ఆచార్య' సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో చిరూ సరసన కాజల్ .. చరణ్ జోడీగా పూజా హెగ్డే కనిపించనున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల చేయనున్న సినిమాలోను ఇద్దరు కథానాయికలు కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఆ కథానాయికలలో నభా నటేశ్ పేరు వినిపిస్తోంది.

కొరటాల .. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక భారీ చిత్రం రూపొందనుంది. ఇది పూర్తి కొరటాల మార్క్ మూవీ. యాక్షన్ .. ఎమోషన్ కు సందేశం తోడై ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకుముందు కొరటాల చేసిన 'భరత్ అనే నేను' సినిమాలో కైరా కథనాయికగా కనువిందు చేసింది. అందువలన ఆమెను తీసుకోవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఆమె కాదనదనే నమ్మకాలు ఎక్కువయ్యాయి.  

ఒకవేళ కైరా బిజీగా ఉంటే రష్మికను రంగంలోకి దింపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఈ ఇద్దరిలో మొదటి హీరోయిన్ ఎవరైనా, సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కేది నభా నటేశ్ కేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో తెలుగు తెరకు పరిచయమైన కుర్ర కథానాయికలలో నభా నటేశ్ మాంఛి జోరుమీద ఉంది. గుమ్మడి పువ్వులాంటి ఈ అమ్మాయి, తెరపై గుమ్మడి వడియాల్లా అందాలను ఆరబోయడంలో ముందుంటుంది. అందువలన ఈ పిల్లను తీసుకోవడమంటూ జరిగితే అది మాస్ ఆడియన్స్ కి పండగే!       
Tags:    

Similar News