పురుషుల్లో మహేష్‌.. విజయ్‌ - స్త్రీల్లో కాజల్‌.. రకుల్‌

Update: 2019-12-11 07:09 GMT
ఈమద్య కాలంలో సోషల్‌ మీడియా చాలా పాపులర్‌ అయ్యింది. సెలబ్రెటీలు తమకు సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకునేందుకు ఎక్కువగా ఇష్టం చూపిస్తున్నారు. అందుకే వారి అభిమానులు కూడా భారీ ఎత్తున సోషల్‌ మీడియాను ఫాలో అవుతున్నారు. 2019 సంవత్సరంకు గాను ఇండియన్‌ ఫిల్మ్‌ స్టార్స్‌ లో ట్విట్టర్‌ లో ఎక్కువగా ట్రెండ్‌ అయ్యింది.. సందడి చేసింది ఎవరు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

పురుషుల్లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మరియు తమిళ స్టార్‌ హీరో విజయ్‌ లు టాప్‌ 10 లో స్థానం దక్కించుకున్నారు. సౌత్‌ నుండి వీరు మాత్రమే టాప్‌ లో ఉన్నారు. మహేష్‌ బాబుకు 5వ స్థానం దక్కగా విజయ్‌ కి 9వ స్థానం దక్కింది. తమిళ దర్శకుడు అట్లీ కుమార్‌ కూడా ఈ జాబితాలో నిలిచాడు. ఆయన కు 10వ స్థానంఉ ట్విట్టర్‌ కట్టబెట్టింది. ఇక లేడీస్‌ స్టార్స్‌ విషయానికి వస్తే కాజల్‌ మరియు రకుల్‌ లు నిలిచారు.

ఈ ఏడాది వీరిద్దరు కూడా పెద్దగా సినిమాల్లో నటించలేదు. వీరు నటించిన సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ అవ్వనూ లేదు. అయినా కూడా ట్విట్టర్‌ లో వీరు ఈ ఏడాది ఎక్కువగా ట్రెండ్‌ అయ్యారు. అందుకు కారణం వీరి హాట్‌ ఫొటో షూట్స్‌ అయ్యి ఉంటాయి. వారంలో రెండు మూడు హాట్‌ ఫొటో షూట్స్‌ ను ఈ ముద్దు గుమ్మలు ఇద్దరు పదే పదే పోస్ట్‌ చేస్తూ ఉంటారు. అందుకే కాజల్‌ కు 7వ స్థానం దక్కగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు 10వ స్థానం దక్కింది. సౌత్‌ నుండి వీరిద్దరికి మాత్రమే టాప్‌ 10 లో స్థానం దక్కడం విశేషం.
Tags:    

Similar News