డ్రగ్స్ ఏమో కాని.. టిఆర్పీస్ పరుగులే

Update: 2017-07-19 08:28 GMT
ఇప్పుడు ఏ తెలుగు మీడియాను చూసినా కూడా.. ఖచ్చితంగా డ్రగ్స్ గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి. పైగా ఇప్పుడు స్వయంగా పూరి జగన్ ఎక్సయిజ్ శాఖ విచారణకు హాజరు కావడంతో.. ఈ వార్తల జోరు మరింత పెరిగింది. అక్కడ సూ్కల్ పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు అన్నప్పుడు లేని కవరేజ్ పూరి విషయంలో మాత్రం లైవ్ కెమెరాలు లైవ్ ఇన్పుట్స్ అన్న చందాన సాగుతోంది.

అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇప్పటివరకు పూరి జగన్ మీడియాకు ఏమీ చెప్పలేదు. అలాగే పోలీసులు కూడా మేం ఏమీ చెప్పలేదనే చెబుతున్నారు. కాని మీడియా మాత్రం పూరిని దోషిగా బోను ఎక్కించేసింది. ఇదంతా కాకుండా.. పూరి విచరాణకు హాజరయ్యాడు మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి అంటూ అతగాడి ఫ్యాన్స్ తో ఎక్సయిజ్ ఆఫీస్ బయట నుండి లైవ్ చాటింగులు పెట్టేశారు. అవన్నీ చూస్తుంటే.. అసలు టిఆర్పీలు పరిగెత్తించడానికి మనోళ్లు ఏ రేంజులో కవరేజ్ ఇస్తున్నారో చూస్కోండి. ఇదే ఒక సాధారణ వ్యక్తి గురించి న్యూస్ ఇలా వేస్తారా? వేస్తే జనాలు చూస్తారా అంటున్నారు మీడియావారు.

ఇకపోతే డ్రగ్స్ స్కాండల్ లో కేవలం పూరి జగన్ వస్తేనే హడావుడి ఇలా ఉందంటే.. రేపు రవితేజ.. ఛార్మి వంటి యాక్టర్లు వస్తే ఎలా ఉంటుందో చూస్కోండి. మినిట్ టు మినిట్ కవరేజీలూ.. లోపల ఇన్వెస్టిగేషన్ రూములో వారు ఏం చెబుతున్నారో ఊహాగానాలూ.. వారితో ఏయే ఫ్యామిలీ మెంబర్లు వచ్చారో వారి గురించి కామెంట్లు.. ఫ్యాన్స్.. వారి మనోభావాలూ ఆలోచనలూ ఊహలు.. ఇలా కవరేజీ పిచ్చెక్కించనుంది తెలుగు మీడియా.
Tags:    

Similar News