పవన్‌ తో మల్టీస్టారర్‌ కి ఓకే: మహేష్‌

Update: 2015-08-01 16:11 GMT
మల్టీస్టారర్ల లో నటించడానికి ప్రిన్స్‌ మహేష్‌ ఎప్పుడూ సిద్ధమే. ఇప్పటికే వెంకీతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించాడు. ఆ సినిమా బక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. అయితే ఆ తర్వాత
మహేష్‌-నాగార్జున కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ కోసం మణిరత్నం ప్రయత్నించినా ఎందుకనో వీలుపడలేదు.

అయితే పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తో కలిసి మల్టీస్టారర్‌ చేయడానికి మహేష్‌ సిద్ధమేనా? .. ఇదే ప్రశ్నను ట్విట్టర్‌ లో పవన్‌ అభిమాని అడిగితే మహేష్‌ ఏమని రిప్లయ్‌ ఇచ్చాడో తెలుసా? 'వై నాట్‌' అనేది అట్నుంచి
రిప్లయ్‌. ఇది ప్రిన్స్‌-పవన్‌ అభిమానులకు నిజంగా సంతోషాన్నిచ్చే విషయమే. ఈ కలయిక చూడముచ్చటగా ఉంటుందనడంలో సందేహమే లేదు.

పవన్‌-మహేష్‌ కలయికలో ఓ మల్టీస్టారర్‌ స్క్రిప్టు రెడీగా ఉంటే ఈ ఇద్దరూ నటించడానికి సిద్ధమే. అది టాలీవుడ్‌ లో రికార్డులు తిరగరాయడం షురూ అనే అనుకోవాలి. పవన్‌ జల్సా చిత్రానికి మహేష్‌ వాయిస్‌ ఇచ్చాడు. అప్పట్నుంచి
ఇద్దరిమధ్యా సాన్నిహిత్యం బాగానే ఉంది. అయితే ఈ కలయిక సాధ్యపడేదెప్పుడు? దర్శకరచయిత ఎవరు? అంత సాహసం ఎవరికి ఉంది? కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
 
శ్రీమంతుడు రిలీజ్‌ కి ఇంకో ఆరురోజులే సమయం ఉంది.. కాబట్టి ప్రస్తుతం మహేష్‌ ప్రమోషన్‌ లో బిజీగా ఉన్నాడు. 1నేనొక్కడినే, ఆగడు ఫ్లాపవ్వడంతో ప్రిన్స్‌ పూర్తి కాన్సన్‌ట్రేషన్‌ తో శ్రీమంతుడిని ప్రమోట్‌ చేస్తున్నాడు. ఈ సాయంత్రం హైదరాబాద్‌ లో ప్రత్యేకంగా పాత్రికేయులను కలిసి మాట్లాడాడు ప్రిన్స్‌.
Tags:    

Similar News