పిక్ టాక్ : 53 ఏళ్ల పడుచు అందం

దిల్ సే, బాంబే, భారతీయుడు సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ పై తనదైన ముద్ర వేసిన స్టార్‌ హీరోయిన్‌ మనీషా కొయిరాలా.

Update: 2024-04-29 08:34 GMT

దిల్ సే, బాంబే, భారతీయుడు సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ పై తనదైన ముద్ర వేసిన స్టార్‌ హీరోయిన్‌ మనీషా కొయిరాలా. ఈ నేపాలీ బ్యూటీ హిందీతో పాటు పలు సౌత్ సినిమాల్లో కూడా నటించి అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.


నేపాల్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మనీషా కొయిరాలా 2001 లో నేపాల్‌ రాజ ప్రభుత్వం ఇచ్చే రెండో అత్యున్నత పురస్కారం ను అందుకున్నారు. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని భావించిన మనీషా కొయిరాలా అనుకోకుండా యాక్టర్ ను అయ్యాను అంటూ గతంలో పలు సార్లు చెప్పుకొచ్చారు.


బాలీవుడ్‌ లో సౌదాగర్ అనే సినిమాతో అడుగు పెట్టిన మనీషా తక్కువ సమయంలోనే మంచి విజయాలను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు ఇండియన్ సినిమాలకు చక్కగా సెట్‌ అయ్యే రూపం అవ్వడంతో సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్‌ గా ఆఫర్లు దక్కించుకుంది.

53 ఏళ్ల వయసులో కూడా మనీషా కొయిరాలా యంగ్‌ హీరోయిన్స్‌ కి పోటీగా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ నెట్టింట సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా చీర కట్టు ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా మనీషా కొయిరాలా మళ్లీ అందరి చూపు తన వైపుకు తిప్పుకుంది.

ఈ మధ్య కాలంలో మళ్లీ సినిమాలతో పాటు సిరీస్ ల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్న మనీషా ఇంతటి అందంగా ఉంటే ప్రేక్షకులు ఆధరించకుండా ఉంటారా.. కనుక గతంలో మాదిరిగా మనీషా మళ్లీ బిజీ అవ్వడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News